వినుకొండలో రషీద్ హత్య జగన్ రెడ్డి స్కెచ్ – టీడీపీ

వినుకొండలో రషీద్ హత్య జగన్ రెడ్డి స్కెచ్ అని టీడీపీ ఆరోపించింది. పల్నాడు జిల్లా వినుకొండలో సంచలనంరేపిన రషీద్ హత్య వ్యవహారంపై పొలిటికల్ హీట్ పెంచిన సంగతి తెలిసిందే. రషీద్‌ను చంపిన జిలానీ మీ పార్టీ వ్యక్తి అంటే, మీ పార్టీ వ్యక్తి అంటూ టీడీపీ, వైసీపీ మధ్య వార్ నడుస్తోంది. ఇరు పార్టీల నేతలు పోటా, పోటీగా విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. జలానీ, రషీద్‌లు వైసీపీ లో ఉన్నారని.. వారిద్దరి వ్యక్తిగత కక్ష ఈ హత్యకు దారి తీసిందని.. తమకు పార్టీకి సంబంధం లేదని టీడీపీ చెబుతోంది. లేదు, లేదు జిలానీ కరుగట్టిన టీడీపీ కార్యకర్త అంటూ వైసీపీ ఆరోపించింది. ఇదిలా ఉండగానే నిన్న వైసీపీ అధినేత జగన్..ఢిల్లీ లో రాష్ట్రంలో జరుగుతున్న దాడులు , హత్యలకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు పలు పార్టీలు మద్దతు ఇచ్చారు.

ఈ క్రమంలో టీడీపీ వినుకొండ రషీద్ హత్య ఫై కీలక వ్యాఖ్యలు చేసింది. వినుకొండలో రషీద్ హత్య జగన్ రెడ్డి స్కెచ్ అని టీడీపీ ఆరోపించింది. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించేలా భారీ కుట్రకు తెరతీశారంది. ‘రషీద్ హత్య జరిగిన సమయంలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు అక్కడే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారికి ఆశ్రయం కల్పించిన అద్దంకికి చెందిన ఓ వైసీపీ నేతను పట్టుకున్నారు. ఆ ఇద్దరు కార్యకర్తల కోసం గాలిస్తున్నారు. వారు దొరకగానే, జగన్ రెడ్డి డ్రామా బయట పడనుంది’ అని ట్వీట్ చేసింది. మరి దీనిపై వైసీపీ ఏమంటుందో చూడాలి.