Jagan Mohan Reddy: నేడు బెంగళూరుకు వెళ్లనున్న జగన్

Jagan Mohan Reddy: నేడు బెంగళూరుకు వెళ్లనున్న జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి, ఇటీవల జరిగిన అవిశ్వాస తీర్మానాల తరువాత పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపే లక్ష్యంతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా, ఈ రోజు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు.

Advertisements

సమావేశంలో హాజరు కానున్న పలు కీలక నేతలు

ఈ సమావేశానికి అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం మండలాల ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, తదితర ప్రజాప్రతినిధులతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ఇటీవల చోటుచేసుకున్న అవిశ్వాస తీర్మానాలు, అధికార పార్టీకి ఎదురవుతున్న సవాళ్లు తదితర అంశాలపై సమగ్రంగా చర్చ జరగనుంది. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టపర్చే విధానాలు, నాయకత్వ మార్పులు, ప్రాదేశిక సమీకరణాలు వంటి కీలక అంశాలపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

ఇదే సమయంలో పార్టీలో చిత్తశుద్ధితో పని చేస్తున్న నేతలకు మద్దతు, మార్గదర్షనాలు ఇవ్వడంతో పాటు, రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతానికి సంబంధించి కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ సమావేశం అనంతరం, జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం బెంగళూరు వెళ్లనున్నారు. సాయంత్రం 4:15 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, 5:40 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి, 8:00 గంటలకి బెంగళూరులోని తన నివాసానికి చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Read also: Andhra Pradesh: నాలో ఆ మార్పు తీసుకొచ్చింది చంద్రబాబే: జగన్

Related Posts
TG High court : కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో వాదనలు
Arguments in the High Court on the Kancha Gachibowli land issue

TG High court: తెలంగాణ హైకోర్టులో కంచ గచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్‌, హెచ్‌సీయూ విద్యార్థులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ ప్రారంభమైంది. కంచ గచ్చిబౌలి Read more

Suryakumar Yadav: రిటైర్డ్ హ‌ర్ట్‌పై సూర్య షాకింగ్ రియాక్షన్
తిలక్ రిటైర్డ్ హర్ట్ పై షాక్ అయ్యిన సూర్యకుమార్

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ (MI) మరియు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరిగిన పోరులో తిలక్ వర్మ రిటైర్డ్ హర్ట్ కావడం క్రికెట్ Read more

తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డ్డ‌వారికి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం
Vaikuntha Darshan for those injured in the stampede

తిరుపతి: తిరుప‌తిలో వైకుంఠ ఏకాద‌శి ద్వార ద‌ర్శ‌నం టోకెన్ల జారీ స‌మ‌యంలో జ‌రిగిన తొక్కిస‌లాటలో ఆరుగురు మృతిచెంద‌గా, అనేక మంది గాయ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. అయితే ఈరోజు Read more

టన్నెల్ ప్రమాదం.. ఏడుగురి కోసం గాలింపు!
514579 tunnel

శ్రీశైలం ఎడమ కాలువలోని SLBC టన్నెల్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్ పైకప్పు అకస్మాత్తుగా కూలిపోవడంతో 50 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. ఈ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×