Jagan Mohan Reddy ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలపై దాడి అనివార్య చర్యగా అభివర్ణించిన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పరిశీలకులు, పార్లమెంట్ నియోజకవర్గాల నాయకులు, రీజినల్ కోఆర్డినేటర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న జగన్, పార్టీ ముఖ్యనేతలతో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఇటీవల భారత రక్షణ దళాలు నిర్వహించిన “ఆపరేషన్ సింధూర్”పై స్పందిస్తూ జగన్ మాట్లాడుతూ, భారతదేశ భద్రతకు, సార్వభౌమత్వానికి హాని కలిగించే ఉగ్రవాద శిబిరాలపై కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరమని అన్నారు. ఉగ్రవాదుల దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం భారత ప్రభుత్వానికి తప్పనిసరి బాధ్యత అని పేర్కొన్నారు.
Jagan Mohan Reddy : ఉగ్రదాడులకు గట్టి ప్రతిస్పందన అవసరమే: జగన్
పహల్గామ్ ప్రాంతంలోని బైసరన్ వ్యాలీకి పర్యాటకులుగా వెళ్లిన అమాయక పౌరులపై ఉగ్రవాదులు చేసిన దాడిని మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించిన జగన్, అలాంటి నిష్ఠూర చర్యలకు గట్టి ప్రతిస్పందన ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో భారత రక్షణ దళాలు నిర్వహించిన “ఆపరేషన్ సింధూర్”ను అనివార్యమైన చర్యగా కొనియాడారు.జగన్ (Jagan) మాట్లాడుతూ, దేశ పౌరుల భద్రత ధ్యేయంగా భారత రక్షణ బలగాలు తీసుకుంటున్న చర్యలకు దేశం మొత్తం మద్దతుగా నిలుస్తోందని చెప్పారు. దేశ రక్షణ కోసం ప్రాణాలపైనే పోరాడుతున్న బలగాలకు పూర్తి అండగా నిలవాలని పౌరులందరినీ ఆయన కోరారు.
Read More : Donald Trump : భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలపై ట్రంప్ స్పందన