ఏపీలో దాడులు పెరుగుతున్నాయంటూ ప్రధానికి జగన్ లేఖ

కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి ఏపీలో దాడులు పెరుగుతున్నాయని హత్యాచారాలు , దాడులు , హత్యలు పెరిగాయని , ముఖ్యముగా వైసీపీ నేతల ను , కార్యకర్తలను టార్గెట్ గా టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని మొదటి నుండి వైసీపీ ఆరోపిస్తూ వస్తుంది. రీసెంట్ గా వినుకొండ లో జరిగిన వ్యక్తి దారుణ హత్య ఫై రాష్ట్రపతికి సైతం పిర్యాదు చేయడం జరిగింది. తాజాగా ఈ దాడులపై ప్రధాని మోడీ కి మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ లేఖ రాసారు. వైసీపీ నేతలు, వైసీపీకి సానుభూతిపరులుగా ఉన్నవారే లక్ష్యంగా అధికార కూటమి నాయకులు దాడులు చేస్తున్నారనీ, వైసీపీ నేతల ఇళ్ళు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్ లపై దాడులు చేస్తున్నారనీ, రాష్ట్రంలో వైసీపీ ఎంపీ, ఎంఎల్ఏలుగా పోటీచేసిన అభ్యర్థులకు భద్రత కరువైందని రాశారు. 40-45 రోజులుగా రాష్ట్రంలో రెడ్ బుక్ ఆధారంగా పాలన సాగుతోంది తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో 31 హత్యలు, 300 హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు జరిగాయనీ, 27 ఐఏఎస్, 24 ఐపీఎస్ లకు పోస్టింగులు ఇవ్వకుండా దూరం పెట్టారని జగన్ తన లేఖలో చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఘటనలపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని జగన్ కోరారు. రాష్ట్రంలో హింసని వివరించడానికి ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోరారు.