Jagan invited to South India all party meeting

సౌతిండియా అఖిలపక్ష సమావేశానికి జగన్‌కు ఆహ్వనం

అమరావతి: తమిళనాడు మంత్రి ఈవీ వేలు, డీఎంకే రాజ్యసభ సభ్యుడు విల్సన్ బుధవారం వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఈ మేరకు వారు ఈ నెల 22న చెన్నైలో జరగనున్న సౌత్ ఇండియా అఖిలపక్ష నాయకుల సమావేశానికి జగన్‌ను ఆహ్వానించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ రాసిన లేఖను వైఎస్ జగన్‌కు డీఎంకే నేతలు అందజేశారు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీల అధినేతలు, ప్రతిపక్ష నాయకులకు ఇప్పటికే స్టాలిన్ ఆహ్వానం పంపారు. ఈ క్రమంలో తమిళనాడు డీఎంకే నేతలు వైఎస్ జగన్‌ను కలిశారు.

సౌతిండియా అఖిలపక్ష సమావేశానికి జగన్‌కు

అధికార విపక్ష కూటములతో సమ దూరం

స్టాలిన్ ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరవుతారా ? లేదా అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. లోక్ సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశంపై ఏపీ, తెలంగాణతో పాటు కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల అధినేతలను స్టాలిన్ అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లూ కేంద్రంతో, బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు నెరపినప్పటికీ రాజకీయ పార్టీగా జాతీయ స్థాయిలో అధికార విపక్ష కూటములతో సమ దూరం పాటిస్తూ వచ్చింది.

స్టాలిన్‌తో జట్టుకడతారా ? లేదా?

ఇక వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఇటు ఎన్డీఏ కూటమిలో, అటు ఇండియా కూటమిలో చేరకుండా ఇప్పటి వరకు తటస్థంగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రంతో పోరాటం సాగించే స్టాలిన్‌తో జట్టుకడతారా ? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయవర్గాల్లోనూ ఇది చర్చనీయాంశమైంది. కాగా, తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం ఇండియా కూటమిలో ఉన్నారు. వ్యక్తిగతంగా స్టాలిన్‌తో జగన్ కు స్నేహం ఉంది. ఆ కారణంగానే 2019లో జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ హాజరయ్యారు.

Related Posts
ఉగ్రవాద నాయకుల భేటీ ఎందుకు?
ఉగ్రవాద నాయకుల భేటీ ఎందుకు?

పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK)లో ఉగ్రవాద నాయకుల సమావేశం జరిగింది ఈ భేటీలో జైష్-ఎ-మొహమ్మద్ (JeM) లష్కరే-ఎ-తోయిబా (LeT) అగ్ర కమాండర్లు అలాగే హమాస్ ప్రతినిధులు Read more

అమెరికా దుండగుల కాల్పుల్లో తెలుగు విద్యార్థి మృతి
అమెరికా దుండగుల కాల్పుల్లో తెలుగు విద్యార్థి మృతి

ఉన్నత చదువుల కోసం అగ్ర రాజ్యం అమెరికా వెళ్లి మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి Read more

ఇందిరమ్మ అత్మియా భరోసాపై హరీష్ రావు
ఇందిరమ్మ అత్మియా భరోసాపై హరీష్ రావు

ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మయభరోసం లబ్ధిదారులను ఎంపిక చేయడానికి సరైన ఎంపిక ప్రమాణాలను రూపొందించాలని మాజీ మంత్రి టి. హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మునుపటి Read more

డ్రగ్ వార్ కేసులో ఫిలిప్పీన్స్ మాజీ అధ్య‌క్షుడు రోడ్రిగో డ్యుటెర్టీ అరెస్టు
డ్రగ్ వార్ కేసులో ఫిలిప్పీన్స్ మాజీ అధ్య‌క్షుడు రోడ్రిగో డ్యుటెర్టీ అరెస్టు

డ్ర‌గ్గీల‌ను కాల్చి చంపిన కేసులో.. ఫిలిప్పీన్స్ మాజీ అధ్య‌క్షుడు రోడ్రిగో డ్యుటెర్టీని అరెస్టు చేశారు. అంత‌ర్జాతీయ క్రిమిన‌ల్ కోర్టు ఆదేశాల ప్ర‌కారం ఆయ‌న్ను మ‌నీలా ఎయిర్‌పోర్టులో అదుపులోకి Read more