ys jagan chandrababu

Jagan : చంద్రబాబుపై జగన్ నిప్పులు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఇటువంటి దారుణమైన పాలనను ఎప్పుడూ చూడలేదని అన్నారు. రాష్ట్రం అంతటా బెల్ట్ షాపులు పెరిగిపోతున్నాయని, ఎటు చూసినా అవే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని గుర్తు చేస్తూ, ప్రస్తుతం అధిక ధరలకు ఇసుక అమ్మినా రాష్ట్ర ఖజానాకు లాభం లేదని విమర్శించారు.

Advertisements

చంద్రబాబు తన అనుచరులకు రూపాయికి ఎకరాల చొప్పున భూములు

జగన్ మాట్లాడుతూ చంద్రబాబు తన అనుచరులకు రూపాయికి ఎకరాల చొప్పున భూములు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఊరూ పేరు లేని లూలూ, లిల్లీ కంపెనీలకు భారీగా భూములు ఇస్తున్నారని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసి, మళ్లీ మొబలైజేషన్ అడ్వాన్సులు ప్రవేశపెట్టారని మండిపడ్డారు. “రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది” అంటూ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. మైన్‌లు, ఫ్యాక్టరీలు నడిపేందుకు స్థానిక ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.

జగన్ 2.0లో తప్పకుండా పెద్ద పీట వేస్తా

కుప్పం, కదిరి, మార్కాపురం తదితర నియోజకవర్గాల స్థానిక నాయకులతో జగన్ సమావేశమయ్యారు. కార్యకర్తల సమస్యలు తెలుసుకున్న జగన్, “గతంలో కోవిడ్ కారణంగా పార్టీ కార్యకర్తలకు సహాయపడలేకపోయాం. అయితే జగన్ 2.0లో తప్పకుండా పెద్ద పీట వేస్తా” అని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎదురవుతున్న కష్టాలు తాత్కాలికమేనని, త్వరలోనే మంచి రోజులు వస్తాయని కార్యకర్తలను ధైర్యపరిచారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని, చంద్రబాబుతో వచ్చే దుర్మార్గ పాలన ఎక్కువ రోజులు నిలవదని ధీమా వ్యక్తం చేశారు.

Read Also : Modi : ఏపీకి మోడీ రాక..కట్టుదిట్టమైన భద్రత

Related Posts
వచ్చే నెలలోనే ఏపీ రాష్ట్ర బడ్జెట్..?
ap budget 2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌ను సాధారణ షెడ్యూల్ కంటే ఒక నెల ముందుగా ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. సాధారణంగా ప్రతి ఏడాది మార్చి నెలలో బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. Read more

Telangana: ఈ నెల 15 నుంచి తెలంగాణలో సరస్వతీ పుష్కరాలకు ఏర్పాట్లు
Telangana: ఈ నెల 15 నుంచి తెలంగాణలో సరస్వతీ పుష్కరాలకు ఏర్పాట్లు

తెలంగాణలో ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతి పుష్కరాలు భక్తులకోసం పండుగ వాతావరణాన్ని తలపించనున్నాయి. పుష్కరాల సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం Read more

శ్రీ మందిర్ యొక్క కార్తీక మహా దీపం వేడుక
Kartika Maha Deepam celebration of Sri Mandir

ఆధ్యాత్మిక మేల్కొలుపు మరియు విముక్తి కోసం అరుణాచలేశ్వర దీపం యొక్క ప్రత్యక్ష దర్శనంతో పవిత్రమైన అరుణాచల తీర్థ శివ పార్వతీ కళ్యాణం మరియు మహా రుద్ర హోమంలో Read more

Ketireddy Peddareddy: తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Ketireddy Peddareddy: తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తాడిపత్రి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ శాసనసభ్యుడు కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు నుంచి అనుకూల తీర్పు రావడం, ఆయన తిరిగి తాడిపత్రిలోకి ప్రవేశించేందుకు అవకాశం Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×