కాసేపట్లో ఢిల్లీలో జగన్ ధర్నా

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ నేడు ఢిల్లీలో ధర్నా చేయనున్నారు. ఇందుకోసం నిన్నే హస్తినకు చేరుకున్న ఆయన జంతర్ మంతర్లో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో నిరసన తెలపనున్నారు. గత 50 రోజుల్లో 36 హత్యలు, వెయ్యికి పైగా దాడులతో కూటమి ప్రభుత్వం మారణహోమం సాగిస్తోందని జగన్ తెలిపారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచీ జరుగుతున్న హింసకు సంబంధించిన ఫోటో గ్యాలరీ, వీడియోలను ప్రదర్శించాలని వైసీపీ నిర్ణయించింది. ఈ ఎగ్జిబిషన్ కు మీడియా అంతటినీ ఆహ్వానిస్తుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను హైలెట్ చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని వైసీపీ పేర్కొంది.