వైసీపీ శాసనసభాపక్ష నేతగా జగన్

వైసీపీ శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్ ఎన్నికైనట్లు ఆ పార్టీ నుంచి తనకు సమాచారం అందిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేశారు. కాగా తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్ను ఆదేశించాలని జగన్ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లే రావడంతో ప్రతిపక్ష నేత హోదాకు జగన్ అర్హుడు కాదని టీడీపీ చెబుతోంది.

ఇదిలా ఉంటె ఈరోజు జగన్ ఢిల్లీ లో ధర్నా కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ధర్నా కు వైసీపీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు ఇలా అంత వెళ్లారని అంత అనుకున్నారు కానీ ఆసకస్తికరంగా వైసీపీ కి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు మంగళవారం శాసనమండలికి హాజరయ్యారు. ఢిల్లీకి వెళ్లాల్సిన ఇద్దరు ఎమ్మెల్సీలు శాసనమండలికి రావడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, వంకా రవీంద్ర మంగళవారం మండలికి వచ్చారు. ఇద్దరు ఎమ్మెల్సీలను చూసి టీడీపీ, ఇతర పక్షాల సభ్యులు వారిని ప్రశ్నించారు.. ‘ఇదేంటి.. మీరు ఢిల్లీకి వెళ్లలేదా’ అంటూ ఆరా తీశారు.