అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ రేపు (ఏప్రిల్ 21) తన కుటుంబంతో కలిసి భారత్కు వస్తున్నారు. ఇది అధికారిక పర్యటన అయినా, ఆయన వ్యక్తిగతంగా కుటుంబ సమేతంగా రావడం ఆసక్తికరంగా మారింది. ఈ పర్యటన నాలుగు రోజులు కొనసాగనుంది. ఏప్రిల్ 21 నుంచి 24 వరకు ఆయన భారత్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.వాన్స్ భార్య ఉష భారతీయ మూలాలున్నవారు కావడంతో, ఈ పర్యటన కుటుంబపరంగా కూడా ఎంతో ప్రత్యేకంగా మారబోతోంది. ఢిల్లీకి వచ్చే మొదటి రోజే ఆయన కుటుంబంతో కలిసి భారత సంస్కృతిని అనుభవించేందుకు సిద్ధమయ్యారు.సోమవారం ఉదయం ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్ట్లో జేడీ వాన్స్ అడుగుపెడతారు. వారికి ఘన స్వాగతం పలికేందుకు భారత అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్ర మంత్రుల్లో ఒకరు స్వయంగా వచ్చి స్వాగతం పలుకుతారు.ప్రధాని మోదీతో కీలక భేటీ కూడా ఈ పర్యటనలో ఉంది. అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు వాన్స్ దంపతులు ప్రధాని మోదీ నివాసానికి వెళ్లనున్నారు.

అక్కడ అమెరికా-భారత్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరగనున్నాయి. చర్చల అనంతరం వాన్స్ దంపతులకు మోదీ రాత్రి విందు ఇచ్చే అవకాశం ఉంది.జేడీ వాన్స్ భారత్లో పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. రేపే ఢిల్లీలోని ప్రసిద్ధ అక్షర్ధామ్ ఆలయాన్ని ఆయన కుటుంబంతో కలిసి దర్శించనున్నారు. అనంతరం నగరంలోని చేనేత వస్త్రాల దుకాణాలను సందర్శించనున్నారు.
భారత సంప్రదాయ వస్తువులపై కుటుంబానికి ఆసక్తి ఎక్కువగా ఉండడంతో వారు భారతీయ కళను దగ్గర నుండి చూడాలని భావిస్తున్నారు.ఎల్లుండి ఏప్రిల్ 22న జైపూర్కి వెళ్లే వాన్స్ కుటుంబం అక్కడి చారిత్రక నిర్మాణాలను సందర్శించనుంది. పింక్ సిటీగా పేరు గాంచిన జైపూర్లో అంబర్ కోట, హవా మహల్ వంటి ప్రాచీన కట్టడాలు వారిని ఆకట్టుకోనున్నాయి.అక్కడి నుంచి ఏప్రిల్ 23న వాన్స్ కుటుంబం ఉత్తరప్రదేశ్లోని మగహ్నాన్ని సందర్శించి, ప్రపంచ ప్రసిద్ధ తాజ్మహల్ని వీక్షించనున్నారు. భారతీయ శిల్పకళకు ప్రతీకగా నిలిచిన తాజ్మహల్ చూసేందుకు అమెరికా నేత కుటుంబంతో ముందుగానే ఆసక్తి చూపినట్లు సమాచారం.ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల బలపాటుకు తోడ్పడడమే కాకుండా, జేడీ వాన్స్ కుటుంబానికి భారత సంస్కృతి పట్ల మరింత అర్ధం వచ్చేలా చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ పర్యటన సందర్భంగా అమెరికా-భారత్ సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also : flight ticket prices : భారత్ నుంచి అమెరికాకు చార్జీల్లో అనూహ్య తగ్గుదల