ప్రజల నుండి వచ్చే వినతులు చూస్తే బాధేస్తుంది – చంద్రబాబు

Chandrababu wrote a letter to UPSC

గత ఐదేళ్లలో ప్రజలు ఎన్ని బాధలు పడ్డారో వారి నుండి వస్తున్న వినతులు చూస్తే అర్ధం అవుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. గత ప్రభుత్వం సరిగా పాలన చేయలేదు కాబట్టే, ఇన్ని సమస్యలతో ప్రజలు పోటెత్తుతున్నారని వెల్లడించారు. ఎన్టీఆర్ భవన్‌కు వస్తున్న వినతులపై సీఎం చంద్రబాబు స్పందించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరలోనే ఓ ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తామని, పార్టీ కార్యాలయంలో కూడా ప్రజా సమస్యలు గుర్తించి వాటికి సత్వర పరిష్కారం లభించేలా వచ్చే వారం నుంచీ చర్యలు చేపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత అయిదేళ్లు జగన్ ప్రభుత్వం దెబ్బతిన్న రహదారుల గుంతలు కూడా పూడ్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమవటంతో దెబ్బతిన్న రహదారులతో ప్రజలు నరకం చూస్తున్నారన్నారు. మరి కొద్ది రోజుల్లో దెబ్బతిన్న రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమం కూడా వెంటనే చేపడతామని సీఎం అన్నారు.