ISSF : వరల్డ్ కప్ షూటింగ్లో భారత్కు రెండు రజతాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ISSF) నిర్వహిస్తున్న రెండో ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారత షూటర్లు ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చారు. పెరూ దేశంలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్కు రెండు రజత పతకాలు లభించాయి. ఈ విజయాలతో భారత్ మొత్తం 6 పతకాలు సాధించి మూడో స్థానాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటివరకు భారత ఖాతాలో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్య పతకం ఉన్నాయి.పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో అర్జున్ బాబుటా రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య జరిగిన ఎలిమినేషన్ ఫైనల్లో అర్జున్ 252.3 పాయింట్లతో రెండో స్థానాన్ని సాధించాడు. చైనా షూటర్ షెంగ్ లీహవో 253.4 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, హంగేరీకి చెందిన పెనీ మార్టన్ 229.8 పాయింట్లతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
ISSF :భారత యువ షూటర్ల అద్భుత ప్రదర్శన, రెండు రజతాలతో మరోసారి ఆకట్టింపు
ఇక 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ తరఫున రుద్రాంక్ష్ పాటిల్ మరియు ఆర్య బోర్సి జంట రజత పతకం సాధించింది. ఫైనల్లో ఈ జంట నార్వేకు చెందిన జెనెట్ హెగ్ – జాన్ హెర్మన్ హెగ్ ద్వయంతో తలపడింది. చివరకు స్కోరు 11-17తో నార్వే జట్టు విజయం సాధించడంతో భారత్ రజతంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఈ ఫైనల్లో పాటిల్ – బోర్సి జోడీ మంచి పోటీ ఇచ్చినా, కీలక సమయంలో కొన్ని తప్పిదాలు జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ విజయాలతో భారత్ షూటింగ్ రంగంలో తన స్థాయిని మరోసారి ప్రదర్శించింది. టోర్నమెంట్లో ఇంకా కొన్ని ఈవెంట్లు మిగిలివుండగా, మరిన్ని పతకాలు గెలిచే అవకాశాలపై ఆశాభావం నెలకొంది.
Read More : IPL 2025: ధోనీ కాళ్లు మొక్కిన వైభవ్ సూర్యవంశీ!