పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతిస్పందనపై పాకిస్థాన్ లోపల భయాందోళనలు మొదలయ్యాయి. భారత్ నుంచి ఎదురయ్యే సైనిక చర్యల ముప్పుతో పాకిస్థాన్ వణికిపోతోంది. భారత పౌర విమానాలు, మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లు తమ గగనతలంలోకి ప్రవేశించకుండా పాక్ ప్రభుత్వం వెంటనే నిషేధాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ చర్యలతోపాటు, తన ప్రధాన ఉగ్రవాద కేంద్రాలపై భారత వాయుసేన ఎయిర్ స్ట్రైక్ చేయొచ్చని పాక్ అంచనా వేస్తోంది.
అత్యవసర స్థితిలోకి వెళ్లిన పాకిస్థాన్
ఇండియాకు చెందిన గూఢచార సంస్థలు, రక్షణశాఖ సైనిక స్థాయిలో ప్రతిస్పందనకు రంగం సిద్ధం చేస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో పాకిస్థాన్ అత్యవసర స్థితిలోకి వెళ్లింది. ముఖ్యంగా లష్కర్-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయంపై ఇండియా దాడికి దిగుతుందని అంచనా వేసి, అక్కడి నుంచే పెద్దఎత్తున తరలింపు చర్యలు ప్రారంభించినట్టు సమాచారం. పాక్ ఎయిర్ ఫోర్స్ (PAF) హెర్క్యులస్ వాహనాల ద్వారా కీలక ఉగ్రవాదుల్ని, పత్రాలు, ఆయుధాల్ని ఇతర ప్రాంతాలకు చాపకింద నీరులా తరలిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి.
భారత్ తీసుకునే తదుపరి చర్యలపై అంతర్జాతీయంగా ఆసక్తి
ఈ నేపథ్యంలో భారత్ తీసుకునే తదుపరి చర్యలపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ ఇప్పటివరకు చూపిన ధీర్ఘదృష్టి, దూకుడుతో మళ్లీ ఒక బలమైన ప్రతిస్పందన రావచ్చని భావన ఏర్పడుతోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్, పాక్ను అన్ని మర్చిపోయేలా చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. పాకిస్థాన్ పై దౌర్జన్యంతో పాటు అంతర్జాతీయ వేదికలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు కూడా కొనసాగనున్నాయి.
x
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతిస్పందనపై పాకిస్థాన్ లోపల భయాందోళనలు మొదలయ్యాయి. భారత్ నుంచి ఎదురయ్యే సైనిక చర్యల ముప్పుతో పాకిస్థాన్ వణికిపోతోంది. భారత పౌర విమానాలు, మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లు తమ గగనతలంలోకి ప్రవేశించకుండా పాక్ ప్రభుత్వం వెంటనే నిషేధాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ చర్యలతోపాటు, తన ప్రధాన ఉగ్రవాద కేంద్రాలపై భారత వాయుసేన ఎయిర్ స్ట్రైక్ చేయొచ్చని పాక్ అంచనా వేస్తోంది.
అత్యవసర స్థితిలోకి వెళ్లిన పాకిస్థాన్
ఇండియాకు చెందిన గూఢచార సంస్థలు, రక్షణశాఖ సైనిక స్థాయిలో ప్రతిస్పందనకు రంగం సిద్ధం చేస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో పాకిస్థాన్ అత్యవసర స్థితిలోకి వెళ్లింది. ముఖ్యంగా లష్కర్-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయంపై ఇండియా దాడికి దిగుతుందని అంచనా వేసి, అక్కడి నుంచే పెద్దఎత్తున తరలింపు చర్యలు ప్రారంభించినట్టు సమాచారం. పాక్ ఎయిర్ ఫోర్స్ (PAF) హెర్క్యులస్ వాహనాల ద్వారా కీలక ఉగ్రవాదుల్ని, పత్రాలు, ఆయుధాల్ని ఇతర ప్రాంతాలకు చాపకింద నీరులా తరలిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి.
భారత్ తీసుకునే తదుపరి చర్యలపై అంతర్జాతీయంగా ఆసక్తి
ఈ నేపథ్యంలో భారత్ తీసుకునే తదుపరి చర్యలపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ ఇప్పటివరకు చూపిన ధీర్ఘదృష్టి, దూకుడుతో మళ్లీ ఒక బలమైన ప్రతిస్పందన రావచ్చని భావన ఏర్పడుతోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్, పాక్ను అన్ని మర్చిపోయేలా చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. పాకిస్థాన్ పై దౌర్జన్యంతో పాటు అంతర్జాతీయ వేదికలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు కూడా కొనసాగనున్నాయి.