భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం సరికాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభిప్రాయపడ్డారు. యుద్ధ పరిస్థితుల మధ్య వినోద కార్యక్రమాలు జరగకూడదని ఆమె వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ఆర్మీకి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న కవిత, ఈ పోటీలను వాయిదా వేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రపంచానికి తప్పుడు సందేశం
“ఒకవైపు దేశం యుద్ధం చేస్తున్న సమయంలో, మరోవైపు అంతర్జాతీయ అందాల పోటీలు నిర్వహిస్తే ప్రపంచానికి తప్పుడు సందేశం వెళ్తుంది. ఐపీఎల్ పోటీలు కూడా ఈ కారణంగా వాయిదా వేయబడ్డాయి. అందువల్ల మిస్ వరల్డ్ పోటీలను కూడా అదే తరహాలో వాయిదా వేయాలి,” అని ఆమె స్పష్టం చేశారు.
ప్రజలంతా దేశానికి మద్దతుగా నిలవాల్సిన అవసరం
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా దేశానికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని కవిత పిలుపునిచ్చారు. సైనికుల త్యాగాలకు గౌరవం నివ్వాలంటే ప్రజలు కూడా తమ ఆచరణలో మార్పు చూపించాలన్నారు. సైనికులకు మద్దతుగా దేశవ్యాప్తంగా నైతికంగా ఏకతాటిపై ఉండేలా కార్యక్రమాలను నిర్వహించాలన్నది ఆమె అభిప్రాయం.
Read Also : Vijay Devarakonda: విజయ్తో మరోసారి నటించనున్నరష్మిక మందన్న