Modi govt's big action afte

India : మరో సంచలన నిర్ణయం దిశగా భారత్?

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్థాన్‌పై ఆగ్రహంగా ఉన్న భారత్, ఇప్పటికే పలు దౌత్య చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు నేషనల్ మీడియా వర్గాలు వెల్లడించాయి. 2021 ఫిబ్రవరి 24న అమల్లోకి వచ్చిన భారత్–పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేయాలని కేంద్రం యోచనలో ఉంది. ఈ నిర్ణయం తీసుకుంటే, సరిహద్దుల్లో భారత సైన్యానికి మరింత స్వేచ్ఛ కలగనుంది.

Advertisements

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్టు రక్షణ శాఖ నివేదిక

ఇటీవల కాలంలో పాకిస్థాన్ ఆర్మీ తరచూ కాల్పులకు పాల్పడుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్టు రక్షణ శాఖ నివేదికలు వెల్లడించాయి. అలాగే, ఉగ్రవాద సంస్థలు కశ్మీర్‌లోకి చొరబడి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ పరిస్థితుల్లో ఒప్పందాన్ని కొనసాగించడం మన జవాన్లకు అడ్డంకిగా మారుతుందని కేంద్రం భావిస్తోంది. దీంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసి, భారత్ సైనిక బలగాలకు కౌంటర్ చర్యలు తీసుకునే వెసులుబాటు కల్పించాలనే నిర్ణయానికి రావచ్చు.

దేశ భద్రత, జవాన్ల ప్రాణాల పరిరక్షణే ప్రాధాన్యం

ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతను మరింత పెంచే అవకాశం ఉంది. భారత్ తీసుకునే ఈ చర్య అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారనుంది. దేశ భద్రత, జవాన్ల ప్రాణాల పరిరక్షణే ప్రాధాన్యం అనే సందేశంతో కేంద్రం ఈ దిశగా కదులుతున్నట్లు తెలుస్తోంది. గతంలో సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్‌లతో భారత్ తన స్థైర్యాన్ని ఇప్పటికే చాటిందని విశ్లేషకులు గుర్తిస్తున్నారు. తాజా నిర్ణయం కూడా అదే రీతిలో కఠినమైన విధానానికి సంకేతమని భావిస్తున్నారు.

Related Posts
Simhachalam Incident : సింహాచలం ఘటనలో ఏడుగురు అధికారులపై వేటు వేసిన ప్రభుత్వం
Simhachalam Temple నేడు సీఎం చంద్రబాబుకు రిపోర్ట్ సమర్పించిన కమిటీ చైర్మన్ సురేష్ కుమార్

ప్రముఖ పుణ్యక్షేత్రమైన విశాఖపట్నంలోని సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఇటీవల గోడ కూలిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటనలో ఏడుగురు Read more

Nepal: నేపాల్‌లో హింసాత్మకంగా మారిన ‘పీపుల్స్ మూవ్‌మెంట్ ‘
నేపాల్‌లో హింసాత్మకంగా మారిన 'పీపుల్స్ మూవ్‌మెంట్ '

నేపాల్‌లో రాచరికం మద్దతుదారుల 'పీపుల్స్ మూవ్‌మెంట్ ' మొదటి రోజే హింసాత్మకంగా మారింది. ఈ ఆందోళనల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. దీంతో రాచరిక అనుకూల శక్తులు తమ Read more

విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల
విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల

అమరావతి: ఏపీలో విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉపఎన్నికకు నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల Read more

సీతారామన్‌కు CII బడ్జెట్ సూచనలు
సీతారామన్ కు CII బడ్జెట్ సూచనలు

ప్రముఖ పరిశ్రమల సమాఖ్య (CII) కేంద్ర బడ్జెట్ 2025-26 ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా తక్కువ ఆదాయ స్థాయిలో వినియోగాన్ని Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×