ఆంధ్రాలో రేపే ఇంటర్ ఫలితాల విడుదల

Inter Results: ఆంధ్రలో రేపే ఇంట‌ర్ ఫ‌లితాలు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఫస్టియర్ మరియు సెకండియర్ ఫలితాలు ఏప్రిల్ 12 (శనివారం) ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నట్లు రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ప్రకటించారు. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

Advertisements

నారా లోకేశ్ ప్రకటన

శుక్రవారం నాడు మంత్రివర్యులు మీడియాతో మాట్లాడారు. ఇంటర్మీడియట్ ఫలితాలను ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తాం. ఒకేసారి ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఫలితాలను ప్రకటించబోతున్నాం, అని తెలిపారు. ఈ ప్రకటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల ప్రతినిధులు ఎదురుచూపులు ముగిశాయి. ఆధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు పొందవచ్చు- https://resultsbie.ap.gov.in అంతేకాదు, ఫలితాలను తెలుసుకునే మరొక సులభమైన మార్గం కూడా ఉంది. మీ మొబైల్ ఫోన్‌లో  హాయ్  అని మెసేజ్‌ను మన మిత్ర నంబర్ 9552300009కు పంపితే, వెంటనే మీ ఫలితాన్ని పొందవచ్చు. ఇది విద్యార్థులకు అత్యంత ఉపయోగకరమైన డిజిటల్ సౌకర్యం. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 లక్షలకుపైగా విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యారు. అందులోనూ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ పరీక్షలు విద్యార్థుల భవిష్యత్‌కు కీలకం కావడంతో ఫలితాలపై ఆసక్తి, ఉత్కంఠ ఇంకా పెరిగింది. ప్రవేశ పరీక్షలు, డిగ్రీ కోర్సులు మొదలగు తదుపరి విద్యా అవకాశాలపై ఈ ఫలితాల ప్రభావం ఉంటుంది.

వాట్సాప్ ద్వారా..
ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009కు హాయ్ అని మెసేజ్ పెట్టాలి.
సెలెక్ట్ సర్వీస్ లో విద్యా సేవలు ఆప్షన్ ను ఎంచుకోవాలి.
డౌన్ లోడ్ ఏపీ ఇంటర్ ఫలితాలు 2025ను ఎంచుకోవాలి.
హాట్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేసి మెమో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Read also: Tenth Results : ఏప్రిల్ 22న ఏపీ టెన్త్ ఫలితాలు?

Related Posts
నకిలీ సర్టిఫికెట్ తో కోర్ట్ ను మోసగించిన అనిల్‌కుమార్
నకిలీ సర్టిఫికెట్ తో కోర్ట్ ను మోసగించిన అనిల్‌కుమార్

చంద్రబాబునాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్ట్ అయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కుమార్ హైకోర్టును తప్పుదోవ Read more

sunitha williams: సునీతా విలియమ్స్‌కు డాల్ఫిన్ల స్వాగతం
సునీతా విలియమ్స్‌కు డాల్ఫిన్ల స్వాగతం

భూమికి సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణంభారత సంతతికి చెందిన ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ చివరకు సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భూమికి చేరుకున్నారు. ఆమెతో పాటు బుచ్ Read more

యుద్ధనౌకలను జాతికి అంకితం చేసిన మోడీ
narendra modi

భారత యుద్ధనౌకలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి కొద్దిసేపటి ప్రధాని మోడీ జాతికి అంకితం చేసారు. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్- నీలగిరి, ఐఎన్ఎస్ వాఘ్‌షేర్ Read more

సత్యవర్ధన్ ను వల్లభనేని వంశీ బెదిరించారు: విజయవాడ సీపీ
సత్యవర్ధన్ ను వల్లభనేని వంశీ బెదిరించారు: విజయవాడ సీపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారం రాజకీయ వర్గాలలోను, ప్రజలలోను చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×