నేడు ఇంటర్ ఫలితాలు
Telangana : రాష్ట్రంలో మార్చి 5 నుంచి 25 వరకు జరిగిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలను నేడు (మంగళవారం) విడుదల చేయనున్నారు. ఫలితాలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు నాపంల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 19 కేంద్రాల్లో మూల్యాంకనాన్ని కొనసాగించారు. మూల్యాంకనం 21 నుంచి ప్రారంభమయ్యింది, కానీ సంస్కృతం మూల్యాంకనం మార్చి 10 నుండి ప్రారంభమైంది.ఇందులో ఈ ఏడాది మొదటిసారిగా, మూల్యాంక కేంద్రాల్లో సిబ్బందికి ఆధార్ బయోమెట్రిక్ ఆధారిత అటెండెన్స్ ను అమలు చేశారు.
Read More :TG Inter Results: మరికాసేపట్లో తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల