Inter results on 22nd of this month in Telangana

Telangana : తెలంగాణలో ఈ నెల 22న ఇంటర్ ఫలితాలు

Telangana : ఈ నెల 22న ఇంటర్‌ ఫలితాలు వెలువడనున్నాయి. మంగళవారం (ఏప్రిల్‌ 22) మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లో చూసుకోవచ్చు. మొదటి సంవత్సరం, సెకండియర్‌ ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

Advertisements
తెలంగాణలో ఈ నెల 22న ఇంటర్

డిప్యూటీ సీఎం భట్టి ఫలితాలను విడుదల చేస్తారు.

నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో మంగళవారం నాడు ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి ఫలితాలను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సహా అధికారులు పాల్గొననున్నారు. ఇంటర్ ఫలితాలు నేరుగా బోర్డు అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in లో అందుబాటులో ఉంటాయి. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్ధులు తమ హాల్ టికెట్ నెంబర్ , పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. కాగా ఏపీ ఇంటర్‌ ఫలితాలు ఈ నెల 12న విడుదలైన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో సుమారుగా 9,96,971 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు

కాగ, తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 5, 2025 నుండి మార్చి 24, 2025 వరకు జరిగాయి. రెండవ సంవత్సరం పరీక్షలు మార్చి 6, 2025 నుండి మార్చి 25, 2025 వరకు జరిగాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3, 2025 నుండి ఫిబ్రవరి 22, 2025 వరకు జరిగాయి. రాష్ట్రంలో సుమారుగా 9,96,971 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,88,448 మంది కాగా.. రెండవ సంవత్సరం విద్యార్థులు 5,08,253 మంది ఉన్నారు. ఈ పరీక్షలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,532 కేంద్రాలలో జరిగాయి. మూల్యాంకనం పూర్తయ్యింది. ఫలితాల విడుదల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Also: సన్నబియ్యం పథకం గ్రాండ్ సక్సెస్

Related Posts
YS Sharmila: కిరణ్ చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించిన షర్మిల
కిరణ్ చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించిన షర్మిల

వైఎస్ భారతి రెడ్డిపై టీడీపీకి చెందిన కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. ఇదే అంశంపై వైఎస్ షర్మిల తీవ్రంగా Read more

తిరుమల లడ్డు ప్రసాదంలో ఎలాంటి కొవ్వు లేదు – India Today సంచలన అధ్యయనం
tirumala laddu

తిరుమల లడ్డూ ప్రసాదం విషయమై India Today తన అధ్యయన ఫలితాలను బహిర్గతం చేసింది. దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ప్రసాదాలపై పరిశీలన జరిపిన అనంతరం, తిరుమల లడ్డూ Read more

కొత్త కారు కొనుగోలు చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్..ధర తెలిస్తే షాకే
mla mynampally rohit

రోహిత్ కొత్త కారును కొనుగోలు చేసిన వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ తెలంగాణలో అత్యంత పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రూ.3 కోట్ల విలువైన Read more

Adil Hussain Thoker: ఆదిల్ థోకర్ విద్యార్థి నుంచి ఉగ్రవాదిగా మారిన వైనం
Adil Hussain Thoker: ఆదిల్ థోకర్ విద్యార్థి నుంచి ఉగ్రవాదిగా మారిన వైనం

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న ఆదిల్ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×