Indian fisherman commits suicide in Pakistan jail!

Indian fisherman: పాకిస్థాన్‌ జైల్లో భారత మత్స్యకారుడు ఆత్మహత్య !

Indian fisherman: భారత్‌కు చెందిన ఓ మత్స్యకారుడు పాకిస్థాన్ కారాగారంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాత్‌రూమ్‌లో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఆ జైలు సూపరింటెండెంట్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. భారత్‌- పాకిస్థాన్ జల సరిహద్దులపై సరిగా అవగాహన లేకుండా చేపల వేటకు వెళ్లి అక్కడి అధికారులకు చిక్కినవారు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా భారత్‌కు చెందిన మత్స్యకారుడు గౌరవ్‌రామ్‌ ఆనంద్‌ను (52) 2022లో అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్టు చేసి కరాచీ జైల్లో ఉంచారు. నాటినుంచి అతడు అక్కడి కారాగారంలోనే మగ్గిపోతున్నాడు. అయితే.. మంగళవారం రాత్రి బాత్‌రూమ్‌లోకి వెళ్లిన మత్స్యకారుడు తాడుతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Advertisements
పాకిస్థాన్‌ జైల్లో భారత మత్స్యకారుడు

చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసేంతవరకు మృతదేహాన్ని కోల్డ్‌ స్టోరేజ్‌లో

అతడు ఎంతసేపటికి బయటకి రాకపోవడంతో అనుమానించిన జైలు అధికారి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసేంతవరకు మృతదేహాన్ని కోల్డ్‌ స్టోరేజ్‌లో ఉంచనున్నట్లు పాక్‌ అధికారులు తెలిపారు. కాగా, గత నెలలో తమ కారాగారంలో ఉన్న 22 మంది మత్స్యకారులను పాక్‌ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. వారి శిక్షాకాలం పూర్తికావడంతో కరాచీలోని మాలిర్ కారాగారం నుంచి విడుదల చేసింది. మత్స్యకారులు సరిహద్దులను సరిగా గుర్తించకపోవడంతో ఇరువైపులా ఈ అరెస్టులు జరుగుతున్నాయి. ఇదిలాఉంటే.. జనవరి 1న ఇరుదేశాల ఖైదీల జాబితా మార్పిడి జరిగింది. పాకిస్థాన్‌లో 266 మంది భారత ఖైదీలు ఉన్నారు. భారత జైళ్లలో మొత్తం 462 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు మన దేశ జాబితా పేర్కొంది. తాజాగా ఓ మత్స్యకారుడు జైల్లో ఆత్మహత్యకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది.

Related Posts
ఆర్జీ కార్ కేసులో దోషికి మరణశిక్ష విధించాలి: సీబీఐ
ఆర్జీ కార్ కేసులో దోషికి మరణశిక్ష విధించాలి సీబీఐ

కోల్కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసులో పౌర స్వచ్ఛంద సేవకుడు సంజయ్ రాయ్‌ను సీబీఐ కోర్టు Read more

Chandrababu: 27వ తేదీన పోలవరం సందర్శించనున్న చంద్రబాబు
27వ తేదీన పోలవరం సందర్శించనున్న చంద్రబాబు

ఏలూరు/ పోలవరం ప్రభాతవార్త: రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఈనెల 27వ తేదీన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పరిశీలన చేసేందుకు విచ్చేయుచున్న దృష్ట్యా ముఖ్యమంత్రి పర్యటనా Read more

దీపికా పదుకొణె కీలక వ్యాఖ్య‌లు
దీపికా పదుకొణె కీలక వ్యాఖ్య‌లు

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌తి ఏటా నిర్వ‌హించే 'ప‌రీక్షా పే చ‌ర్చ' కార్య‌క్ర‌మంలో ఈసారి బాలీవుడ్ న‌టి దీపికా పదుకొణె పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా Read more

అత్యాచారం కేసు..ప్రజ్వల్ రేవణ్ణ బెయిల్ పిటిషన్‌ తిరస్కరణ
Rape case.Prajwal Revanna bail petition rejected

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, ప్రజ్వల్ రేవణ్ణకు ఈరోజు సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది. ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదురుకుంటున్న Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×