India will give a strong response to this attack.. Rajnath Singh

Rajnath Singh : ఈ దాడికి భారత్‌ గట్టిబదులిస్తుంది : రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh : కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పహల్గాంలో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదలబోమన్నారు. దాడికి భారత్‌ గట్టిబదులిస్తుందని ఉగ్రవాదులను హెచ్చరించారు. తమ కుటుంబసభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేది భారత్‌ విధానమని..ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని పేర్కొన్నారు.

Advertisements
 ఈ దాడికి భారత్‌ గట్టిబదులిస్తుంది రాజ్ నాథ్ సింగ్

కుట్ర పన్నిన వారిని బయటకు లాగి, తగిన బుద్ధి చెబుతాం

దాడికి పాల్పడిన వారిని..కుట్ర పన్నిన వారిని బయటకు లాగి, తగిన బుద్ధి చెబుతామని అన్నారు. పహల్గాం ఘటనకు సంబంధించిన విషయాలు, శ్రీనగర్‌లో భద్రతా చర్యలు వంటి వాటి గురించి ఆయన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్‌ అడ్మిరల్ దినేశ్‌ త్రిపాఠితో చర్చలు జరిపిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగనున్న భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలోనూ ఆయన పాల్గొననున్నారు.

అతి సమీపం నుంచి కాల్పులు

కశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్‌ లోయలో ఉగ్రవాదులు మంగళవారం భీకర దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యటకులను చుట్టుముట్టి.. అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం అడవుల్లోకి పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మర గాలింపుచర్యలు చేపట్టాయి.

Read Also: ఉగ్రదాడి.. ముగ్గురు టెర్రరిస్టుల స్కెచ్‌లు విడుదల

Related Posts
నమీబియా తొలి మహిళా అధ్యక్షురాలిగా నెటుంబో నాండి-న్డైత్వా
namibia president

నమీబియా యొక్క శాసనసమితి సభ్యులుగా ఉండే SWAPO పార్టీకి చెందిన నేత నెటుంబో నాండి-న్డైత్వా నమీబియా కొత్త రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆమె ఈ దేశానికి తొలి మహిళా Read more

V. Narayanan : దేశ భద్రతే లక్ష్యం… ఇస్రో ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
V. Narayanan దేశ భద్రతే లక్ష్యం... ఇస్రో ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

దేశ భద్రతను కాపాడేందుకు ఆకాశంలో పది కీలక ఉపగ్రహాలు పనిచేస్తున్నాయని ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ తెలిపారు. తూర్పు భారతదేశంలోని అగర్తలాలో జరిగిన సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ Read more

Suresh Raina: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ కు ఫిధా అయిన సురేష్ రైనా
Suresh Raina: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ కు ఫిధా అయిన సురేష్ రైనా

ఐపీఎల్ 2025 సీజన్‌లో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.14 ఏళ్లకే ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన Read more

మహా కుంభమేళాలో విజయ్ దేవరకొండ
మహా కుంభమేళాలో విజయ్ దేవరకొండ

నటుడు విజయ్ దేవరకొండ తన తల్లి మాధవి దేవరకొండతో కలిసి మహా కుంభమేళాలో పాల్గొన్నారు. పవిత్ర జలాల్లో స్నానం చేసి, ప్రత్యేక ప్రార్థనలు చేసిన విజయ్ దేవరకొండ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×