ఇండియా-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో జమ్ము కశ్మీర్లోని శ్రీనగర్ ఎయిర్పోర్టు వద్ద డ్రోన్ దాడి సంచలనం రేపుతోంది. పదుల సంఖ్యలో డ్రోన్లను పాకిస్తాన్ వైపు నుంచి భారత వైమానిక స్థావరాలపై టార్గెట్ చేస్తూ లాంచ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా భారత భద్రతా వ్యవస్థను గందరగోళానికి గురిచేయాలన్న దుష్ప్రయత్నాన్ని భారత భద్రతా దళాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి.
అన్ని వైపుల నుంచి రక్షణ
భద్రతా అధికారులు అత్యున్నత అప్రమత్తతకు చేరుకొని, అన్ని వైపుల నుంచి రక్షణ చర్యలను చేపట్టారు. భారత వైమానిక దళాలు, ఆర్మీ యూనిట్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమై డ్రోన్లను గాల్లోనే చేజిక్కించకుండా ధ్వంసం చేస్తున్నాయి. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేయడంతో అక్కడ బ్లాస్ట్ సాధ్యపడని పరిస్థితి నెలకొంది. ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలను పూర్తిగా సీజ్ చేశారు.
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
ఈ ఘటనపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుత పరిస్థితిని అధికారులు పూర్తిగా నియంత్రణలోకి తీసుకున్నారని వెల్లడించారు. ఎలాంటి అపాయాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. అవసరం లేని పక్షంలో ఎవ్వరూ బయటకు రావొద్దని, ఇళ్లలోనే ఉండాలని స్థానిక ప్రభుత్వ అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారం సైనిక దళాలకు మరింత బలాన్నిస్తుందని తెలిపారు.