భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న తరుణంలో పాకిస్థాన్ నుంచి డ్రోన్ దాడులు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్పూర్ జిల్లాలో ఓ జనవాసంపై పాక్ డ్రోన్ బాంబు వేశినట్లు సమాచారం. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు తీవ్రంగా గాయపడగా, వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడితో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
హోశియార్పుర్లో భారీ పేలుడు శబ్దాలు
ఇక సరిహద్దు ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోశియార్పుర్లో భారీ పేలుడు శబ్దాలు విన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఘటనకు సంబంధించి స్పష్టత ఇంకా రానప్పటికీ, ఇది డ్రోన్ దాడి కావచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఇది పాక్ ఉగ్ర శక్తుల కుట్రగా అధికారులు భావిస్తున్నారు.
జలంధర్ నగరంలో బ్లాక్ అవుట్
మరోవైపు పంజాబ్లోని జలంధర్ నగరంలో బ్లాక్ అవుట్ కొనసాగుతోంది. ప్రజలకు ఎలాంటి సమాచార ప్రబంధం లేకుండా ఉండిపోవడం కలవరపెడుతోంది. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలపై దాడులు జరిగి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నియంత్రించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అనుమానాస్పద విషయాలు ఉన్నా పోలీసులకు తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Also : Kamal Haasan : వేడుకలు చేసుకోవడానికి ఇది సమయం కాదన్న కమల్ హాసన్