పాకిస్థాన్ దాడులు మరింత తీవ్రతరం అవుతున్నాయి. జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్ వద్ద పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ భారత మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరోకరు తీవ్రంగా గాయపడగా, ఒక జవాన్కు కూడా గాయాలయ్యాయి. నిరంతర కాల్పులతో అక్కడి ప్రజలు భయానక వాతావరణంలో జీవిస్తున్నారు. పాక్ దాడులు పౌరులను లక్ష్యంగా చేసుకోవడంతో పరిస్థితి మరింత విషమంగా మారుతోంది.
ఘాటైన కాల్పులకు పాక్
ఇదే సమయంలో, రాజౌరి, అఖ్నూర్, జమ్మూ, కుప్వారా జిల్లాలపై కూడా పాకిస్థాన్ సైన్యం ఘాటైన కాల్పులకు పాల్పడుతోంది. ఈ కాల్పుల కారణంగా వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. నష్టం మొత్తం ఇంకా అంచనా వేయాల్సి ఉన్నా, మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు. పౌరులు రక్షణ కోసం సురక్షిత ప్రాంతాల వైపు పరుగులు పెడుతున్నారు.
భారత పోలీసులు, రక్షణ బలగాలు అప్రమత్తం
ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, పోలీసులు, రక్షణ బలగాలు అప్రమత్తమయ్యాయి. కాల్పులు కొనసాగుతున్న ప్రాంతాల్లో ప్రజలను తక్షణమే సురక్షిత శిబిరాలకు తరలిస్తున్నారు. ప్రాథమిక సహాయం, వైద్యం, తిండి వంటి అవసరాలకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఉగ్రవాదానికి, విదేశీ దాడులకు తలొగ్గే ప్రసక్తి లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. పాక్ రెచ్చగొట్టే చర్యలకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Also : Andhra Pradesh: యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ కి చంద్రబాబు,లోకేష్ నివాళి