భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధ స్థాయికి చేరుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం, భారత్ పాకిస్థాన్లోని మూడు ప్రధాన ఎయిర్బేసులపై దాడికి దిగినట్లు పాక్ మిలిటరీ వర్గాలు తెలిపాయని ‘Reuters’ వార్తా సంస్థ పేర్కొంది. రావల్పిండీలోని నూరాఖాన్ ఎయిర్బేస్తో పాటు మురిద్, షార్కోట్ ఎయిర్బేస్లపై భారత వైమానిక దళం భీకర దాడులు చేసినట్లు వెల్లడించారు. ఈ దాడులతో పాక్ వైమానిక శక్తికి భారీ దెబ్బతగిలినట్టు అక్కడి వర్గాలు పేర్కొంటున్నాయి.
పాక్ మిస్సైళ్లతో దాడులు
ఇక మరోవైపు, పాక్ కూడా మౌలిక స్థాపనలపై దాడులకు దిగింది. భారత దేశంలోని పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని పలు నగరాలపై పాక్ మిస్సైళ్లతో దాడులు చేసినట్లు ‘రిపబ్లిక్ టీవీ’ వెల్లడించింది. మిస్సైల్ దాడుల వల్ల పలు ప్రాంతాల్లో భవనాలు ధ్వంసమయ్యాయని, ప్రజలకు గాయాలు అయ్యాయని సమాచారం. భారత భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉండి పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
పాకిస్థాన్ ఎయిర్స్పేస్ను మూసివేత
భారత్ వైమానిక దాడులకు స్పందనగా పాకిస్థాన్ తన ఎయిర్స్పేస్ను తాత్కాలికంగా మూసివేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ, ఇరుదేశాల ప్రభుత్వాలు సైనిక స్థాయిలో ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నాయి. ఈ పరిణామాలు గమనిస్తున్న ప్రపంచ దేశాలు శాంతి పిలుపునిస్తుండగా, యుద్ధ భీకర దృశ్యాలు సరిహద్దుల్లో ముసురుకుంటున్నాయి.
Read Also : Airports : దేశంలో 32 ఎయిర్పోర్టులు మూసివేత