Andhra Pradesh:కృత్రిమ మేధ తో రాష్ట్ర ఆదాయం పెంచండి: సీఎం చంద్రబాబు

Andhra Pradesh:కృత్రిమ మేధ తో రాష్ట్ర ఆదాయం పెంచండి: సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు  రాష్ట్ర ఆదాయం పెంచే అంశంపై ఫోకస్ పెట్టారు. పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్‌ పెట్టాలని అధికారులకు సూచించారు. పన్నుల వసూళ్లలో టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. పన్నుల వసూళ్లు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పనిచేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆదాయార్జన శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మరిన్ని ఆదాయ మార్గాలను వెతకడంతో పాటు, ఎక్కడ ఆదాయం తక్కువగా నమోదవుతుందో దానికి గల కారణాలను వెతికి చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. పన్నుల చెల్లింపుల దగ్గర నుంచి రశీదులు, నోటీసులు జారీ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో జరగాలని చెప్పారు.మున్సిపల్ శాఖ ఇచ్చిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా రాష్ట్రంలో వెయ్యి మందికి పైగా బిల్డర్లు అసలు రిజిస్టర్ కాలేదని ఏఐ గుర్తించిందని, జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రభుత్వం ఎటువంటి ఆమోదాలైనా తెలపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పన్ను ఎగవేతదారులను పసిగట్టేందుకు ఏఐని వినియోగించుకోవాలని ఆదేశించారు.అన్ని ఆదాయార్జన శాఖల్లోనూ ఇదే తరహా ప్రక్రియ అమలు చేసి పకడ్బందీగా పన్ను వసూళ్లు చేయాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా వ్యాపారులకు పన్ను చెల్లింపులు, అనుమతులు వంటివి సులభతరం అవుతున్నాయనే విషయాన్ని వారికి తెలియజేయాలన్నారు. పన్నుచెల్లింపుదారులు, జీఎస్టీ పోర్టల్, ఏపీ రాష్ట్ర డేటా సెంటర్, ఏపీసీటీడీ ఇలా మొత్తం శాఖల సమాచారాన్ని ఏఐతో అనుసంధానించాలని చేయాలని అధికారులకు సూచించారు.

Advertisements

మొబైల్ నెంబర్

ప్రజా ఫిర్యాదులు, వినతుల పరిష్కారంలో మరింత వేగంగా స్పందించాలని, ఎప్పటికప్పుడు దరఖాస్తుదారులకు గ్రీవెన్స్ స్థితిని తెలియజేసే సమాచారం అందించాలని, ఇందుకోసం ఏఐ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పరిష్కరించగలిగే వినతులను నిర్ణీత కాలవ్యవధిలోగా పరిష్కరించాలని చెప్పారు. అలాగే పరిష్కరించలేని వినతుల విషయంలో ఫిర్యాదుదారులకు ఎందుకు పరిష్కరించలేకపోతున్నామనే విషయాన్ని వివరంగా తెలియజేయాలని సూచించారు.గ్రీవెన్స్‌ల పరిష్కారంపై మంగళవారం సచివాలయంలో ప్రత్యేకంగా సమీక్షించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.

 Andhra Pradesh:కృత్రిమ మేధ తో  రాష్ట్ర ఆదాయం పెంచండి: సీఎం చంద్రబాబు

ఏఐని వినియోగించి

ఈ ఆర్ధిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రాష్ట్ర సొంత ఆదాయ లక్ష్యం రూ.1,37,412 కోట్లను 100 శాతం ఆర్జించేలా అన్ని శాఖలు కృషి చేయాలని అధికారులకు సూచించారు. పన్ను చెల్లింపుదారులకు నోటీసుల జారీకి, గ్రీవెన్స్‌లు స్వీకరించడానికి ఏఐని వినియోగించి ప్రభుత్వ యంత్రాంగంలో మరింత వేగం పెంచాలన్నారు. మున్సిపల్ శాఖలో 2023-24 కంటే 2024-25లో రూ.500 కోట్లకు పైగా ఆదాయం అదనంగా వచ్చిందని పన్నులకు సంబంధించి ఇంకా సుమారు రూ.2,500 కోట్ల బకాయిలు ఉన్నాయని అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు.

Read Also: Narendra Modi : తిరుపతి-కాట్పాడి రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

Related Posts
Chandrababu: పారిశుద్ధ్య కార్మికుల‌తో చంద్ర‌బాబు సమావేశం
Chandrababu: తణుకులో సీఎం చంద్రబాబు పర్యటన: కార్మికుల కోసం కొత్త ప్రణాళికలు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. ముఖ్యంగా పారిశుద్ధ్య Read more

‘మద్యం’ విషయంలో మాట మార్చిన తెలుగు సీఎంలు
wineprice

మద్యం ధరలు పెరిగిన నేపథ్యంలో వినియోగదారులు ఆగ్రహంతెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరల పెంపు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ‘మద్యం' విషయంలో మాట మార్చిన తెలుగు సీఎంలు.ఎన్నికల Read more

Tenth Results : ఏప్రిల్ 22న ఏపీ టెన్త్ ఫలితాలు?
AP 10th results on April 22?

Tenth Results : ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 22న లేదంటే రెండ్రోజులు అటూ ఇటుగా ఫలితాలు ప్రకటిస్తారని Read more

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
election commission of tela

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 10 ఎమ్మెల్సీ (ఎమ్మెల్యే కోటా) స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారికంగా షెడ్యూల్ విడుదల చేసింది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×