Important announcement on Kodali Nani health.. Transfer to Mumbai!

Kodali Nani : కొడాలి నాని ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ముంబ‌యికి త‌ర‌లింపు !

Kodali Nani: ఈ నెల 26న వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోడాలి నాని హార్ట్ ఎటాక్‌ కు గురైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనను ప్రస్తుతం నగరంలోని ఏఐజీ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. అయితే, నాని తాజా హెల్త్ కండీషన్‌పై ఏఐజీ వైద్యులు ఇవాళ ఉదయం బులిటిన్ విడుదల చేశారు. కాసేపట్లో ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. నాని గుండెలో మొత్తం 3 వాల్స్ క్లోజ్ అవ్వడంతో క్రిటికల్ సర్జరీ చేసి హార్ట్ స్టంట్ లేదా బైపీస్ సర్జరీ చేయాలని కుటుంబ సభ్యులకు సూచించామని వారు తెలిపారు.

Advertisements
కొడాలి నాని ఆరోగ్యంపై కీల‌క

మెరుగైన చికిత్స కోసం ముంబ‌యికి

దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను ముంబ‌యిలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌ కు తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లుగా సమచారం. కాగా, మార్చి 27, 2025న వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ ద్వారా కొడాలి నానిని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. ఏఐజీ వైద్యులు ఆయనకు గుండె సంబంధిత అసాధారణతలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. కానీ అధికారికంగా గుండెపోటు అని నిర్ధారించలేదు. కొన్ని వార్తా సంస్థలు సర్జరీ అవసరం కావచ్చని పేర్కొన్నప్పటికీ, ఈ విషయంలో అప్ప‌టికి స్పష్టత రాలేదు.

ఆ తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు

ఇక, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కొడాలి నాని గుడివాడ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు. ఇటీవల వల్లభనేని వంశీ అరెస్టైన తర్వాత విజయవాడ జైలుకు తరలించగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వంశీని పరామర్శించేందుకు వచ్చారు. ఆ సమయంలో కొడాలి నాని జైలు దగ్గరకు జగన్‌తో కలిసి వచ్చారు. అలాగే గుంటూరు మిర్చియార్డుకు వైఎస్ జగన్ వచ్చిన సమయంలో కూడా నాని అక్కడికి వచ్చారు. ఆ తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు.

Related Posts
Caller ID : ఇంటర్‌నెట్‌వర్క్ కాలర్ ఐడీ సేవలు ఎప్పుడు?
Caller ID ఇంటర్‌నెట్‌వర్క్ కాలర్ ఐడీ సేవలు ఎప్పుడు

Caller ID : ఇంటర్‌నెట్‌వర్క్ కాలర్ ఐడీ సేవలు ఎప్పుడు? సెల్‌ఫోన్ వినియోగదారులకు త్వరలోనే స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టే ‘సీఎన్‌ఏపీ’ సేవలు అందుబాటులోకి రానున్నాయి. టెలికామ్ Read more

 టీడీపీ ఆఫీసుపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి కేసులు సీఐడీకి అప్పగింత
tdp office attack case 114183947

టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులు సీఐడీకి బదిలీ ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రధాన కార్యాలయం మరియు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంపై జరిగిన దాడుల Read more

4.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా..!
Rythu Bharosa in the accounts of 4.41 lakh farmers.

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం రూ.569 కోట్ల రైతు భరోసా విడుదల చేసింది. మొత్తం 32 జిల్లాల్లో 563 గ్రామాలలో 4,41,911 మంది రైతులకు ఎకరానికి రూ.12 Read more

పోచారం శ్రీనివాసరెడ్డి పై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
jeevan reddy pocharam

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి.. తన అనుచరుడు గంగారెడ్డి హత్యపై తీవ్ర విమర్శలు చేశారు. సొంత పార్టీలో జరుగుతున్న ఫిరాయింపులు కారణంగా ఈ ఘటన జరిగిందని.. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×