Implementation of Section 144 in Tirupati.

తిరుపతిలో 144 సెక్షన్‌ అమలు..!

తిరుమల : తిరుపతిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో తిరుపతిలో 144 సెక్షన్ అమలులో ఉంది. ఎస్వీ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

మరోవైపు తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని వైసీపీ ఆరోపించగా.. తాము క్షేమంగానే ఉన్నామని వారు వీడియోలు రిలీజ్ చేశారు. ఇది ఇలా ఉండగా.. అర్థరాత్రి తిరుపతిలో హైడ్రామా చోటు చేసుకుంది..అభినయ రెడ్డి దాడి చేశాడని అంటున్నారు. టీడీపీ నేత మబ్బు దేవనారాయణరెడ్డి ఇంట్లో తమ కార్పొరేటర్లు ఉన్నారంటూ మాజీ డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి దాడికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. తన అనుచరులతో బీభత్సం సృష్టించిన అభినయ రెడ్డి… దాడికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి.

image

కాగా, తిరుపతి జిల్లా నందు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నందు ఖాళీగా ఉన్న డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశం నిబంధనల మేరకు కోరం లేక పోవడం వలన వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి పట్టణం నందు 144 సెక్షన్ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు అమలులో ఉంటుందని కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. అలాగే శాంతి భద్రతల పరిరక్షణ దిశగా అదనపు బలగాలతో సుమారు 250 మందితో బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ నేటి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Related Posts
ఏపీలో ఈరోజు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ పథకం అమలు
Free gas cylinder guarantee scheme to be implemented in AP from today

అమరావతి: ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని నవంబర్ 1వ తేదీ శుక్రవారం నుంచి అమలులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు Read more

భోజన ప్రేమికుల కోసం సరికొత్త మెనూని పరిచయం చేసిన బౌగెన్‌విల్లా రెస్టారెంట్
Bougainvillea Restaurant introduces a brand new menu for food lovers copy

హైదరాబాద్ : వినూత్నమైన వంటకాలకు ప్రసిద్ధి చెందిన ప్రీమియం రెస్టారెంట్, బౌగెన్‌విల్లే , భోజన ప్రేమికుల కోసం సరికొత్త మెనూని పరిచయం చేసినట్లు వెల్లడించింది. రెండేళ్ళ క్రితం Read more

నేడు జాతీయ యువజన దినోత్సవం
నేడు జాతీయ యువజన దినోత్సవం

1984లో, భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుండి ఈ వేడుక స్వామి వివేకానంద బోధనలు, తత్వశాస్త్రాలను గుర్తు చేస్తూ యువతకు ప్రేరణగా Read more

ప్రపంచాన్ని వణికిస్తున్న చైల్డ్‌ కిల్లర్‌ వైరస్
ప్రపంచాన్ని వణికిస్తున్న చైల్డ్‌ కిల్లర్‌ వైరస్

భారతదేశంలో కరోనా వైరస్‌ మరచిపోకముందే హెచ్‌ఎంపీవీ వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి.ఈ కొత్త వైరస్‌ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. వైరస్‌ను ఎదుర్కొనడానికి ప్రభుత్వం ప్రణాళికలు తీసుకుంటోంది.కానీ, ఇది Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *