If elected president. my first signature on it.Kamala Harris

అధ్యక్షురాలిగా ఎన్నికైతే.. దానిపైనే నా తొలి సంతకం: కమలా హారిస్

వాషింగ్టన్ : అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలోని వలసల వ్యవస్థపై ఉపాధ్యక్షురాలు రిపబ్లికన్ అభ్యర్థి కమలా హారిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షురాలిగా ఎన్నికైతే వలసల వ్యవస్థను సరిచేసే బిల్లుపై తొలి సంతకం చేస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

‘అమెరికాలో ఇమ్మిగ్రేషన్‌ సమస్య ప్రధానమైనది. ఈ సమస్య పరిష్కారంపై మేం దృష్టిసారించాం. అధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ వలసల వ్యవస్థను సరిచేసే బిల్లుపై సంతకం చేస్తాను. ఈ బిల్లులో వలసల సమస్య పరిష్కారానికి వనరులు పెంచడం, ఎక్కవమంది న్యాయమూర్తులను నియమించడం, జరిమానాలు కఠినతరం చేయడం వంటి అంశాలు ఉంటాయి. సరిహద్దులను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్‌లోని సంప్రదాయ సభ్యులతో సహా ద్వైపాక్షిక ప్రయత్నానికి మద్దతుగా 1,500 మంది బోర్డర్ ఏజెంట్లను నియమిస్తాం. ఇది అక్రమ వలసలను నియంత్రించడంతో పాటు, సరిహద్దుల వెంబడి దేశంలోకి వస్తున్న మాదక ద్రవ్యాలను నిరోధించేందుకు ఉపయోగపడుతుంది. మరో 20 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ఈ సమస్యను పరిష్కరించగలిగే అధ్యక్షుడు ఎవరనేది ప్రజలు నిర్ణయిస్తారు’ అని హారిస్‌ పేర్కొన్నారు.

ఇటీవల కమలాహారిస్ యూఎస్- మెక్సికో సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించారు. ఆ సమయంలో అక్రమ వలసలను నివారించేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేస్తానని ఆమె వ్యాఖ్యానించారు. అయితే హారిస్ వ్యాఖ్యలపై డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. నాలుగేళ్లుగా సరిహద్దు వద్దకువెళ్లని హారిస్‌కు ఎన్నికల వేళ అక్రమ వలసల సమస్య గుర్తొచ్చిందా అని ఎద్దేవా చేశారు. హింసాత్మక మూకలు అమెరికాలో ప్రవేశించి ఇక్కడ హత్యలు, అత్యాచారాలు చేస్తున్నా పదవిలో ఉండి పట్టించుకోలేదని మండిపడ్డారు. చిన్న పట్టణాలను ఆమె శరణార్థి శిబిరాలుగా మార్చేశారంటూ ఆరోపించారు.

Related Posts
‘సంక్రాంతికి వస్తున్నాం’పై హైకోర్టులో పిల్
'సంక్రాంతికి వస్తున్నాం'పై హైకోర్టులో పిల్

సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన 'సంక్రాంతికి వస్తునం' చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ సందర్భంగా, మూడు రోజులుగా తెలుగు చిత్ర నిర్మాతల ఇళ్లలో మరియు ఆఫీసుల్లో ఐటీ Read more

తెలంగాణ లో కొనసాగుతున్న గ్రూప్ 3 పరీక్షలు
group 3 exams

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌-3 పరీక్షలు ఆదివారం మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1,401 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 115 కేంద్రాలు Read more

నేడు స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ లాంచ్
Swarnandhra 2047

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు. విజయవాడలో జరగనున్న ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర Read more

రేపు సెలవు – తెలంగాణ ప్రభుత్వం ప్రకటన
Holiday tomorrow - Announcement by Telangana Govt

తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పబ్లిక్ హాలిడే ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మరియు బ్యాంకులు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *