'తల్లికి వందనం' కు మార్గదర్శకులు

Lotteries in AP : ఆంధ్రాలో లాటరీలు, ఆన్‌లైన్ గేమింగ్‌ అనుమతించే ఆలోచన!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి దాదాపు ఏడాది పూర్తవుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పన్నులు, జీఎస్టీ ఆదాయం క్రమంగా తగ్గుతూ ఉండటం ప్రభుత్వాన్ని వేధిస్తోంది. గతంలో జగన్ సర్కార్ కంటే ప్రస్తుతం పన్నుల వసూళ్లు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ప్రజల వద్ద ఖర్చు చేసేందుకు డబ్బు లేకపోవటమే అనే వాదన కూడా వినిపిస్తోంది.

Advertisements
ఆంధ్రాలో లాటరీలు, ఆన్‌లైన్ గేమింగ్‌ అనుమతించే ఆలోచన!

ఆదాయం పొందే ప్రణాళికలు
ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సర్కార్ పన్ను ఆదాయాన్ని పెంచుకోవడానికి వివిధ అదనపు పన్నులు, సెస్‌ల ద్వారా రూ.13,100 కోట్ల వరకు ఆదాయం పొందే ప్రణాళికలను రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా లాటరీలు, ఆన్‌లైన్ గేమింగ్‌ను అనుమతించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ అంశంపై ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి ప్రకటన చేయలేదు. సీఎం చంద్రబాబు దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఒక సీనియర్ అధికారి అందించిన సమాచారం ప్రకారం తెలుస్తోంది.
ఏపీలో ప్రస్తుతం లాటరీలపై నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే లాటరీలు, ఆన్‌లైన్ గేమింగ్‌లపై ప్రతిపాదిత పన్నుపై చట్టపరమైన అభిప్రాయం కూడా అవసరమని సదరు అధికారి పేర్కొన్నారు.

కొత్త ఆదాయాల అన్వేషణ పనిలో..
ఆమోదం పొందిన తర్వాత వినోద పన్ను పెంపు సినిమా థియేటర్లు, పార్కులు, ఇతర పర్యాటక ఆకర్షణలలో అధిక ఛార్జీలకు దారితీస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి, సూపర్ సిక్స్ పథకాల కింద ఎన్నికల ముందు వాగ్దానాలలో భాగంగా రాష్ట్రంలో అమలు చేయబడుతున్న మెగా సంక్షేమ పథకాలను కొనసాగించడానికి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నందున, పన్ను ఆదాయం పెరగడం రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కీలకంగా మారిపోయింది. కొత్త పన్ను ప్రతిపాదన ఆమోదించబడితే పన్ను ఆదాయం గణనీయంగా పెరుగుతుందని తెలుస్తోంది.

Related Posts
మిర్చి రైతులను ఆదుకోవాలని చంద్రబాబుకు జగన్ ట్వీట్
మిర్చి రైతులను ఆదుకోవాలని చంద్రబాబుకు జగన్ ట్వీట్

మిర్చి రైతులను ఏపీ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరు మార్కెట్ యార్డులో Read more

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఈరోజు ప్రారంభమైంది. దీపం 2 పథకంలోని భాగంగా సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురంలో ఈ Read more

Amaravati ORR: 121 గ్రామాల మీదుగా అమరావతి ఓఆర్ఆర్
121 గ్రామాల మీదుగా అమరావతి ఓఆర్ఆర్

Amaravati ORR: 121 గ్రామాల మీదుగా అమరావతి ఓఆర్ఆర్ ఏపీ ప్రభుత్వం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా మార్చేందుకు సీఎం చంద్రబాబు Read more

వైఎస్‌ఆర్‌సీపీ-టీడీపీ మధ్య ఉద్రికత్తలు..మాజీ మంత్రి అప్పలరాజు గృహ నిర్బంధం
Tensions between YSRCP TDP.Former minister Appalaraju under house arrest

అమరావతి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ-పలాసలో వైస్‌ఆర్‌సీపీ మరియు టీడీపీ నేతల మధ్య జరిగిన గొడవలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. దీంతో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×