YS Jagan : పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు నమోదు చేసినా, ఇబ్బందులకు గురి చేసినా తాను కానీ, పార్టీ శ్రేణులు కానీ భయపడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో తనను అన్యాయంగా 16 నెలల పాటు జైలులో ఉంచారని, పార్టీని నడపలేని పరిస్థితులు కల్పించినా ప్రజలు తనను, పార్టీని ఆదరించారని ఆయన గుర్తు చేసుకున్నారు.

అక్రమాస్తుల కేసులో అన్యాయంగా ఇరికించారు
ఇప్పుడు ప్రతి గ్రామంలో మన పార్టీ ఉంది. వాళ్లు ఎన్ని కేసులు పెడితే ప్రజలు అంత తీవ్రంగా స్పందిస్తారు. నన్ను మరోసారి జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచివేయలేరు” అని అన్నారు. నాడు నన్ను 16 నెలలు జైలులో పెట్టారు. పార్టీని నడిపే పరిస్థితి లేకుండా చేశారు. అయినా ప్రజలు ఆశీర్వదించారు. గతంలో అక్రమాస్తుల కేసులో తనను అన్యాయంగా ఇరికించి జైలుకు పంపినా, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి అఖండ విజయాన్ని అందించారని జగన్ గుర్తుచేశారు.
ప్రజల మద్దతు తమకే ఉంటుందని ధీమా
అదే విధంగా, ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కేసులు బనాయించినా ప్రజల మద్దతు తమకే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు ఎదురైనా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని జగన్ ఈ సమావేశం ద్వారా సంకేతాలు పంపారు. ప్రభుత్వ చర్యల వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగి, అది అంతిమంగా తమ పార్టీకే లాభిస్తుందని అభిప్రాయపడ్డారు.
Read Also: కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన చికిత్స