నిర్దేశిత స‌మ‌యంలో నిర్మాణాలు పూర్తి చేయాలి: రేవంత్ రెడ్డి

నేను అందరికీ నచ్చాలని లేదు – సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తాను అందరికీ నచ్చాలనుకోవడం లేదని, కొందరికి తన విధానాలు నచ్చవచ్చని, మరికొందరికి నచ్చకపోవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి పదవిని కూడా కొందరు అంగీకరించకపోవచ్చని, అయితే ఎవరూ తనను తప్పుబట్టలేని విధంగా పాలనను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

It doesn't matter if I am the last Reddy CM..Revanth Reddy

ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తా

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్న వారిపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, అలాంటి విమర్శలు పట్టించుకోకుండా ముందుకు సాగతానని తెలిపారు.

మంత్రివర్గ విస్తరణ నా ఒక్కడి నిర్ణయం కాదు

తన మంత్రివర్గ విస్తరణపై వ్యాఖ్యానించిన ఆయన, ఈ నిర్ణయం ఒక్కడిగా తాను తీసుకునేది కాదని, అది సమగ్ర చర్చల అనంతరం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే, పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయాన్ని ప్రస్తావిస్తూ, గతంలో సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీలో చేరారో, ఎవరి హయాంలో మంత్రులయ్యారో ప్రజలకు చెప్పాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ను ప్రశ్నించారు.

ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన పాలనలో పారదర్శకత ఉంటుందని, ప్రజలకు హాని కలిగించే ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Related Posts
ఢిల్లీ ఎన్నికలు.. తొలి గంటల్లో పోలింగ్ శాతం..
Delhi Elections.. Polling percentage in the first hours

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్‌ ప్రారంభం కాగా.. తొమ్మిది గంటల వరకు 8.10 శాతం పోలింగ్‌ నమోదైంది. పలు Read more

బతికున్నంత కాలం రాజకీయ వారసుడిని ప్రకటించను: మాయావతి
Will not declare a political heir while alive.. Mayawati

లక్నో: తాను బతికున్నంత వరకు తన వారసుడిని ప్రకటించనని బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. తన మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌ను అన్ని పార్టీ పదవుల నుంచి తొలగిస్తున్నట్టు Read more

రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్
రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్

పార్లమెంటులో లోపభూయిష్ట కుల గణన నివేదికను సమర్పించినందుకు కాంగ్రెస్‌ను కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు, వారు ప్రజలను తప్పుదారి పట్టించారని మరియు బీసీ సమాజానికి ద్రోహం చేశారని ఆరోపించారు. Read more

15 గ్యారెంటీలతో ఆప్‌ మేనిఫెస్టో
kejriwal

ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో తొమ్మిది రోజులే సమయం ఉండటంతో అధికార, విపక్ష పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక అధికార ఆమ్‌ Read more