ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన 75వ పుట్టినరోజును పురస్కరించుకొని సోషల్మీడియా వేదికగా తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఇటువంటి అపారమైన అభిమానాన్ని, ఆదరణను పొందడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. శుభాకాంక్షలతో తన మనసు ఉప్పొంగిపోయిందని చెప్పారు.
75 ఏళ్ల నా జీవిత ప్రస్థానం
చంద్రబాబు నాయుడు తన ట్వీట్లో, “75 ఏళ్ల నా జీవిత ప్రస్థానం, 47 ఏళ్ల రాజకీయ ప్రయాణం ఎప్పటికీ మరవలేనిదిగా నిలుస్తుంది. ఈ మొత్తం కాలంలో నాకు తోడుగా నిలిచిన ప్రజలకు, మిత్రులకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
తెలుగు ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు
ఇక ముఖ్యమంత్రి పదవిని నాలుగోసారి చేపట్టేందుకు అవకాశమిచ్చిన తెలుగు ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవే తన ధ్యేయంగా కొనసాగిస్తానని, తమ నమ్మకాన్ని మరింత బలపరుస్తానని స్పష్టంచేశారు. “తెలుగు ప్రజలు నన్ను విశ్వసించి మరోసారి అవకాశం ఇవ్వడం గొప్ప గౌరవం. ఆ విశ్వాసానికి తగిన విధంగా పరిపాలన కొనసాగిస్తాను” అంటూ తెలిపారు.