హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన సంఘటన ఇది బంజారాహిల్స్లో ఉన్న (NIMS) ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో, ఆసుపత్రి అత్యవసర విభాగంలోని ఐదో అంతస్తులో మంటలు ఎగసిపడ్డాయి.కిటికీల నుంచి దట్టమైన పొగలు బయటకు రావడం ప్రారంభమైనప్పటినుంచి, ఆసుపత్రి అంతటా కలకలం మొదలైంది. రోగులు, వారి బంధువులు, ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. కొందరు స్టెప్పుల మీద నుంచి బయటకి వచ్చారు, మరికొందరు అల్లకల్లోలంగా పరుగులు పెట్టారు.ప్రాంతవాసులు కూడా ఈ దృశ్యాన్ని చూసి షాక్కు గురయ్యారు.

పొగల వాసన చుట్టుపక్కల కాలనీల దాకా వెళ్లడంతో అప్రమత్తమయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది నిమ్స్కు చేరుకుని మంటలపై నియంత్రణ కోసం రంగంలోకి దిగారు.ఐదు ఫైరింజన్లు ఒకేసారి పనిచేస్తూ మంటలు అదుపులోకి తీసుకువచ్చాయి. ప్రమాదానికి గల అసలైన కారణం ఇంకా తెలియరాలేదు. అనుమానస్పదంగా విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయినా అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.అగ్నిప్రమాదం జరిగే సమయంలో ఆసుపత్రిలో అనేక మంది రోగులు చికిత్స పొందుతున్నారు. అయితే సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు.అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న రోగులను ఇతర విభాగాల్లోకి తరలించారు.
వైద్యసిబ్బంది తక్షణమే స్పందించి, రోగులకు సహాయం చేయడంతో గందరగోళం తగ్గింది. ఫైర్ సిబ్బంది, ఆసుపత్రి సెక్యూరిటీ స్టాఫ్ కలిసి సహకరించడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురాగలిగారు.అసలు ఈ ప్రమాదానికి కారణం ఏమిటి? భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అన్న దానిపై అధికారులు విచారణ ప్రారంభించారు. అసెంబ్లీ నుంచి ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.ఈ సంఘటన నగర ప్రజల్లో ఆందోళన కలిగించింది. రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకటైన నిమ్స్లో ఇలాంటివి జరగడం పట్ల నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భవన భద్రతపై అనేక ప్రశ్నలు లేవుతున్నాయి.ప్రతిసారి ప్రమాదం తర్వాతే స్పందించాలి అనేది తప్పు అని, ముందస్తు చర్యలు తీసుకోవడం అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు ఉన్నాయా లేదా అన్నదానిపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.