unnamed file

గత పదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది..?: మంత్రి పొన్నం

హైదరాబాద్‌: మంత్రి పొన్నం ప్రభాకర్‌ నేడు గాంధీ భవన్‌లో ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత పదేళ్లలో కేసీఆర్‌ సర్కారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు.

ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తాము చిత్తశుద్ధితో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 150 మందికి మాత్రమే విదేశీ విద్యానిధి ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 500 మందికి విదేశీ విద్యానిధి ఇస్తోందని వివరించారు.

ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలను పొన్నం ప్రభాకర్‌ ఖండించారు. ”మూసీ నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే ఖాళీ చేయిస్తున్నాం. రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వడంతో పాటు నిర్వాసితుల పిల్లల విద్యకు చర్యలు తీసుకుంటాం. బీసీ సంక్షేమ శాఖ, బీసీ కమిషన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖ ద్వారా కులగణన చేపడతాం” అని పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

Related Posts
నితీశ్ కుమార్ రెడ్డికి వైజాగ్ ఎయిర్పోర్టులో ఘనస్వాగతం
Nitish Kumar Reddy received

టీమ్ ఇండియా యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి వైజాగ్ ఎయిర్పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని స్వస్థలానికి చేరుకున్న ఆయనకు Read more

అల్లు అర్జున్ బెయిల్ డిసెంబర్ 30కి వాయిదా!
అల్లు అర్జున్ బెయిల్ డిసెంబర్ 30కి వాయిదా!

తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ బెయిల్ విచారణ డిసెంబర్ 30కి వాయిదా పడింది పుష్ప 2 తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్‌కు సంబంధించి, వర్చువల్‌గా హాజరైన Read more

సింగరేణి లో ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలి – సింగరేణి ఛైర్మెన్
singareni praja palana vija

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా నిర్వహించనున్న ‘ప్రజాపాలన -ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమాన్ని రా ష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో సింగరేణిలో ఘనంగా Read more

ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్న మోదీ
ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్న మోదీ

న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్ నుండి భారతీయ ప్రవాసుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *