ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆర్థిక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో స్టార్ హోటళ్లకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది.బార్ లైసెన్సుల ఫీజులు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటివరకు త్రీస్టార్, పై స్థాయి హోటళ్ల బార్లకు రూ.66.55 లక్షల ఫీజు ఉండేది.ఇందులో రూ.5 లక్షలు లైసెన్సు ఫీజు కాగా, రూ.50 లక్షలు రిజిస్ట్రేషన్ ఛార్జీగా వసూలు చేసేవారు.అంతేకాకుండా, ప్రతి ఏడాది ఫీజు 10% పెరుగుతుంది.నూతన నిర్ణయంతో ఇక నుంచి లైసెన్సు ఫీజు రూ.5 లక్షలకే పరిమితం అవుతుంది.అలాగే నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.20 లక్షలుగా నిర్ణయించారు.ఏటా పెరిగే 10 శాతం ఫీజు పెంపు రద్దు చేశారు.
రాష్ట్రంలో వ్యాపార వాతావరణం మెరుగుపడే సూచనలు
ఈ నిర్ణయం వల్ల హోటల్ యాజమాన్యాలపై ఆర్థిక భారం తగ్గనుంది.ముఖ్యంగా పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో ఇది కీలకంగా మారనుంది.హాస్పిటాలిటీ రంగానికి ఇదొక ఊపిరి పీల్చే అవకాశం.ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఫీజులు ఎక్కువగా ఉండేవి.దీనిపై ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (APTDC) ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చింది ఆ ప్రతిపాదనలతో ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సెప్టెంబర్ 1 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి
తగ్గిన ఫీజులు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.తాజా ఉత్తర్వులు విడుదలయ్యాయి.పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడంలో ఇది కీలకంగా మారనుంది.బార్ల లైసెన్సింగ్ వ్యవస్థను మరింత సరళతరం చేయడం ద్వారా పెట్టుబడులు పెరిగే అవకాశముంది.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇది తోడ్పాటిచేస్తుంది.
Read Also : Food Shortage : పాక్ ఆర్థిక వృద్ధిరేటు 2.7 శాతానికి తగ్గింపు