దేశంలో పెరుగుతున్న వేడి గాలులు..రాష్ట్రాలకు హెచ్చరికలు

Heat Wave: దేశంలో పెరుగుతున్న వేడి గాలులు..రాష్ట్రాలకు హెచ్చరికలు

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడగాలులు వీయనున్నట్లు భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య భారతదేశంలో వీటి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఇందులో దక్షిణ ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్, హరియాణా, విదర్భ ప్రాంతాలు ఉన్నాయి. వీటికి ఏప్రిల్ 25 వరకు యెల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.
కొన్ని ప్రాంతాల్లో వడగాలులు ప్రభావం
గుజరాత్​, తమిళనాడు, మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్​లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు ప్రభావం ఉంటుందని IMD తెలిపింది. ఏప్రిల్ 25 వరకు వేడి, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వివరించింది. అయితే, ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మణిపుర్, మేఘాలయ్, నాగాలాండ్, త్రిపుర, మిజోరంలో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది.

Advertisements
దేశంలో పెరుగుతున్న వేడి గాలులు..రాష్ట్రాలకు హెచ్చరికలు

సాధారణానికి మించి వర్షాలు
మరోవైపు ఇటీవలె వ్యవసాయ రంగానికి తీపి కబురు చెప్పింది భారత వాతావరణ విభాగం (ఐఎండీ). ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో (జూన్‌-సెప్టెంబరు) దేశ వ్యాప్తంగా సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని పేర్కొందిత. తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వానలు పడే అవకాశం ఉందని ప్రటించింది. 1971 నుంచి 2020 వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా దీర్ఘకాలంలో సగటున 87 సెంటీమీటర్ల వర్షం కురుస్తోందని, ఇప్పుడు అందులో 105% దాకా వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.
ఈశాన్య రాష్ట్రాలకు వర్షాలు తక్కువ
అలాగే సాధారణానికి మించి, అధిక వర్షపాత అంచనాలను కలిపి చూస్తే 56% మంచి వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది. అలానే ఈ ఏడాదిలో ఎల్‌నినో ఏర్పడే పరిస్థితులు లేవని వివరించింది. డిసెంబరు-మార్చి మధ్య హిమాలయాలు, యూరో ఏసియా ప్రాంతంలో మంచు తక్కువగా ఉందని, ఇవన్నీ మంచి వర్షాలు కురవడానికి శుభపరిణామాలని IMD పేర్కొంది.

Read Also: Pope Francis : కొత్త పోప్ ఎన్నిక కోసం కీలకమైన ప్రక్రియ

Related Posts
IPL 2025: (KKR)కేకేఆర్‌ ఓటమి పై అజింక్యా రహానే ఏమన్నారంటే?
IPL 2025: (KKR)కేకేఆర్‌ ఓటమి పై అజింక్యా రహానే ఏమన్నారంటే?

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా,కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను సొంతమైదానంలోనే చెన్నై సూపర్‌కింగ్స్‌ రెండు వికెట్ల తేడాతో ఓడించి ఐపీఎల్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది.ప్లేఆఫ్‌ నుంచి నిష్క్రమించిన సీఎస్‌కే Read more

Kedarnath: కేదార్‌నాథ్ ఆల‌యానికి పోటెత్తిన భ‌క్తులు
Kedarnath: కేదార్‌నాథ్ ఆలయానికి పోటెత్తిన భక్తులు

కేదార్‌నాథ్ ఆలయం మళ్లీ భక్తుల సమ్మేళనంతో కళకళలాడుతోంది. శుక్రవారం (మే 2) ఉదయం 7 గంటలకు వేద మంత్రోచ్చారణల నడుమ ఆలయ తలుపులు తెరచడంతో, చార్‌ధామ్ యాత్రలో Read more

రాహుల్ గాంధీ ఆరోపణల పై స్పందించిన ఈసీ
EC responded to Rahul Gandh

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేసిన తెలిసిందే. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ Read more

బీజేపీ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టో
బీజేపీ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టో

ఫిబ్రవరి 5 ఢిల్లీ ఎన్నికల కోసం బిజెపి తన మ్యానిఫెస్టోలో మొదటి భాగాన్ని శుక్రవారం విడుదల చేసింది, మహిళలకు నెలకు 2,500 రూపాయలు, ప్రతి గర్భిణీ స్త్రీకి Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×