తెలంగాణ సంగారెడ్డి జిల్లా లో అమీన్పూర్లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఓ తల్లి తన ముగ్గురు పిల్లల జీవితాలను విషాదకరంగా ముగించిన సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ కలహాల కారణంగా మానసిక ఒత్తిడికి గురైన ఓ తల్లి తన పిల్లలకు విషం తినిపించి, తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రజిత పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ముగ్గురు అమాయక పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.
వివరాలు
అమీన్పూర్లో నివాసం ఉంటున్న రజిత కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. గురువారం రాత్రి ఆమె సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్ (8) కు పెరుగు అన్నం తినిపించింది. అనంతరం తానూ అదే ఆహారం తినగా, భర్త చెన్నయ్యకు మాత్రం పప్పు అన్నం పెట్టింది. అర్ధరాత్రి 11 గంటల సమయంలో వాటర్ ట్యాంకర్ విధులు ముగించుకొని ఇంటికి చేరుకున్న చెన్నయ్య, తన భార్య రజిత కడుపునొప్పితో బాధపడుతున్నట్లు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించాడు. అయితే, అప్పటికే పిల్లలు నిద్రలోనే మృతి చెందారు.
పోస్టుమార్టం
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాల కారణంగానే రజిత ఈ ఘాతుకానికి పాల్పడిందా? లేదా మరెవరైనా ఆహారంలో విషం కలిపారా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజిత పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

వివరాలు సేకరణ
రజిత కుటుంబ పరిస్థితి, భర్తతో సంబంధాలు, ఆర్థిక పరిస్థితి వంటి అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.కుటుంబ సభ్యులను ప్రశ్నించి మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పిల్లలు ప్రాణాలు కోల్పోవడం అందరికీ షాక్కు గురిచేసింది. కుటుంబ కలహాలు ఎంతటి భయంకర పరిణామాలకు దారి తీస్తాయనే దానిపై ఆలోచన కలిగించే సంఘటన ఇది.
దర్యాప్తు
పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.రజిత పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమెను విచారించి అసలు కారణాన్ని తెలుసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.మానసిక ఒత్తిడికి గురైనప్పుడు, కుటుంబ సభ్యులు సమర్ధవంతంగా మాట్లాడుకోవడం, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం. పిల్లల ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమైన విషయం. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదంటే కుటుంబ సభ్యులు పరస్పరం అర్థం చేసుకోవడం అవసరం.