దేశంలో ఏర్పడిన యుద్ధ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో సింగరేణి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, అధికారులు సెలవుల్లో ఉండకూడదని యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా ఆదేశాల ప్రకారం, పౌర రక్షణ కసరత్తులు కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి ఖాళీలు లేకుండా ప్రతి ఉద్యోగి తన పని ప్రదేశంలో హాజరై ఉండాల్సిందిగా తెలిపింది. దీంతో సింగరేణిలో పనిచేస్తున్న సిబ్బందికి తాత్కాలికంగా సెలవుల మీద ఆంక్షలు అమలులోకి వచ్చాయి.
సెలవుల్లో ఉన్న అధికారులు వెంటనే విధుల్లో చేయాలి
ఇందులో భాగంగా ఇప్పటికే సెలవుల్లో ఉన్న అధికారులు వెంటనే తమ విధుల్లో హాజరై రిపోర్ట్ చేయాల్సిందిగా యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో సేవల అవసరం ఎక్కువగా ఉండేందున ఎలాంటి విఘాతం లేకుండా పనులు కొనసాగించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అన్ని విభాగాలు సమర్థంగా పనిచేయాలని స్పష్టం చేసింది.
బొగ్గు ఉత్పత్తి లో జాప్యం ఉండకూడదు
ఈ నిర్ణయం నేపథ్యంలో సింగరేణి సంస్థలో అలర్ట్ స్థాయిలో చర్యలు చేపట్టబడ్డాయి. అత్యవసర సమయాల్లో బొగ్గు ఉత్పత్తి, రవాణా వంటి కీలక విభాగాల్లో జాప్యం జరగకుండా చూసేందుకు ప్రణాళికలు రూపొందించాయి. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమాచారాన్ని సమయానుకూలంగా పంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సంస్థ హెచ్చరించింది.
Read Also : India – Pakistan War : పాక్ కాల్పుల్లో భారత మహిళ మృతి