అసెంబ్లీ బైపోల్స్‌లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ సీఎం భార్య విజ‌యం

Himachal Pradesh CM wife wins in assembly bypolls

మండి: హిమాచల్ ప్రదేశ్‌లోని దేహ్రా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సఖు భార్య కమలేశ్ ఠాకూర్ ఘన విజయం సాధించారు. సమీప బీజేపీ అభ్యర్థి హోష్యార్ సింగ్‌పై 9 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి హోష్యార్ సింగ్ దాదాపు 4 వేల ఓట్ల మెజార్టీతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఆయన వరుసగా రెండుసార్లు ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు.

హిమాచల్ ప్రదేశ్‌లో 3 అసెంబ్లీ ఎనియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. మూడు నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ ఓ స్థానంలో గెలవగా, మరో స్థానంలో ముందంజలో ఉంది. ఓ నియోజకవర్గంలో బీజేపీ ముందంజలో ఉంది.

2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమకు 40 సీట్లు ఇచ్చారని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ అన్నారు. ఫిరాయింపులకు పాల్పడిన వారికి ప్రజలు ఉపఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు. ప్రజాప్రతినిధుల కొనుగోలును తాము సహించేది లేదని ఈ ఫలితాల ద్వారా ప్రజలు స్పష్టం చేశారన్నారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఎమ్మెల్యేలు బీజేపీతో అంటకాగి… రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లారన్నారు. ఎలాంటి కారణాలు లేకుండానే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారన్నారు. దీనిని ప్రజలు గమనించారని పేర్కొన్నారు.