LoC: 50 డ్రోన్లను కూల్చివేసిన భారత సైన్యం!

India – Pakistan War : హై టెన్షన్.. 11 చోట్ల కనిపించిన పాక్ డ్రోన్లు?

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న వేళ, పాకిస్తాన్ డ్రోన్లు భారత సరిహద్దు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కనిపించాయి. ప్రముఖ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ కథనం ప్రకారం, మొత్తం 11 ప్రాంతాల్లో డ్రోన్లు గాలిలో విహరించినట్టు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్‌ లోని సాంబ, కుప్వారా, ఉరి, నౌగామ్-హంద్వారా సెక్టార్‌తో పాటు పూంఛ్, జమ్మూ, పఠాన్ కోట్, రాజస్థాన్‌లోని పోఖ్రాన్, పంజాబ్‌లోని అమృత్ సర్, రాజౌరీ ప్రాంతాల్లో ఈ డ్రోన్లు కనిపించాయి.

అమృత్ సర్ సమీపంలో 4 పేలుళ్లు

ప్రత్యేకంగా అమృత్ సర్ సమీపంలో 4 పేలుళ్లు సంభవించాయన్న వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇదే ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ పాక్ మిసైల్ దాడులకు ప్రయత్నించగా, భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. తాజా ఘటనలతో మళ్లీ అదే ప్రాంతం పాక్ లక్ష్యంగా మారినట్టుగా తెలుస్తోంది. డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు, నిఘా పరికరాలను పంపించే ప్రయత్నాలుగా అధికారులు భావిస్తున్నారు.

సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్

ఈ నేపథ్యంలో అన్ని సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. భారత త్రివిధ దళాలు, ఎయిర్ డిఫెన్స్ యంత్రాంగం, నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. డ్రోన్ల కదలికలను గుర్తించి తక్షణమే వాటిని కూల్చివేయాలన్న దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద చట్టవిరుద్ధ చర్యలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు.

Read Also : BCCI : ఐపీఎల్ వాయిదా..టికెట్ల సొమ్మును వాపసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×