గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లు ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. బుల్డోజర్లు, జేసీబీల సాయంతో వాటిని నేలమట్టం చేస్తున్నారు. గతేడాది జులై నుంచి ఇప్పటి వరకు దాదాపు 400 నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. అయితే ఈ కూల్చివేతలు వివాదాస్పదం అవుతున్నాయి. హైడ్రా అధికారులు వీకెండ్లో కూల్చివేతలు చేపడుతున్నారని పలువురు బాధితులు వాపోతున్నారు. తాము కోర్టులను ఆశ్రయించే వీల్లేకుండా.. కావాలనే సెలువు దినాల్లో కూల్చివేతలు చేపడుతున్నారని అంటున్నారు.

ఈ వ్యవహారంపై గతంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీకెండ్లో కూల్చివేతలు చేపట్టడమేంటని ప్రశ్నించింది. స్వయంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైకోర్టు జడ్జి ముందు హాజరు కావాల్సి వచ్చింది. అయినా మరోసారి వీకెండ్లో కూల్చివేతలు చేపట్టడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా మారరా..? అంటూ తీవ్రస్థాయిలో ఫైరయింది. సెలవు దినాల్లోనే ఎందుకు కూల్చాల్సి వస్తుందని హైకోర్టు ధర్మానసం నిలదీసింది. కూల్చివేతల్లో ఎందుకంత హడావుడి చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడింది. నోటీసులిచ్చి తగిన వివరణ ఇచ్చేదాకా ఆగకుండా కూల్చాల్సిన అవసరం ఏముందని హైడ్రా అధికారులను ప్రశ్నించింది. నోటీసులు జారీచేసిన వెంటనే సమాధానం ఇవ్వడానికి తగిన గడువు ఇవ్వకుండా కూల్చివేస్తారా..? అని ఫైర్ అయింది.
అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడాలోని ఆదివారం పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. ఈ కూల్చివేతలు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ బాల్రెడ్డి అనే వ్యక్తి అత్యవసరంగా హైకోర్టులో హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్ను జస్టిస్ కే లక్ష్మణ్ నేతృత్వంతలోని బెంచ్ విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. శుక్రవారం నోటీసులు ఇచ్చి..శనివారమే వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారన్నారు. ఆ తర్వాత వివరణ తీసుకోకుండానే.. హడావుడిగా ఆదివారమే కూల్చివేతలు చేపట్టారని తెలిపారు. నోటీసులు జారీచేశాక ఆధారాలు సమర్పించి, వివరణ ఇవ్వడానికి గడువు ఇవ్వలేదని.. అలోపే కూల్చివేతలు చేపట్టడం దారుణమన్నారు.
పిటిషన్ తరపు న్యాయవాది వాదనలను పరిగణలోనికి తీసుకున్న హైకోర్టు జడ్జి లక్ష్మణ్.. ఎన్నిసార్లు చెప్పినా హైడ్రా తీరు మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. నోటీసులపై వారంలోగా సమాధానమివ్వాలని పిటిషనర్ను న్యాయస్థానం ఆదేశించింది.ఈ హై కోర్టు ఆగ్రహం దేశవ్యాప్తంగా గొప్ప చర్చకు దారితీసింది. హైడ్రా వంటి గ్యాంగ్ల ద్వారా ప్రజల భద్రత, సామాజిక శాంతి కూలగొట్టబడుతున్న నేపథ్యంలో, ప్రజలు, రాజకీయ పార్టీలు, మరియు న్యాయవాదులు ఈ అంశంపై చర్చించేందుకు సిద్ధమవుతున్నారు.