Rain alert: మూడు రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన

Rain : ఏపీలోని ఆ జిల్లాల్లో రేపు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. కొన్ని జిల్లాల్లో భగ్గుమంటూ ఎండలు పొగలు వేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వరుణుడు విరుచుకుపడుతున్నాడు. ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు కీలక సూచనలు చేసింది. శనివారం రోజున రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే బయటకు వెళ్లకుండా ఉండాలని ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

Advertisements

కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం

అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పిడుగులు పడే అవకాశముండటంతో రైతులు, గిరిజన ప్రాంతాల్లో నివసించే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే సూచనలు కనిపిస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 73 మండలాలు వడగాలుల ప్రభావం

ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని కొన్ని మండలాల్లో శనివారం తీవ్రమైన వడగాలులు ఉంటాయని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 73 మండలాలు వడగాలుల ప్రభావానికి గురికావచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఎండల తీవ్రత వల్ల డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 36.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాబోయే 24 గంటలు ఏపీవాసులకు కీలకంగా మారనున్నాయి.

Related Posts
పలువురు ఐపీఎస్ లను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
telangana ips

తెలంగాణ ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో 8 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు చేస్తూ కీలక మార్పులు చేసింది. ఈ బదిలీల ప్రకారం, గవర్నర్ యొక్క ఏడీసీగా శ్రీకాంత్ Read more

Maoists: లొంగిపోయిన 33 మంది మావోయిస్టులు
Massive encounter.. 8 Maoists killed

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు సమస్యపై పోలీసులు చేపట్టిన ఆపరేషన్ "చేయూత"కు ఆశించిన ఫలితాలు దక్కుతున్నాయి. తాజాగా ఈ ఆపరేషన్‌లో భాగంగా 33 మంది మావోయిస్టులు పోలీసులకు Read more

పోలీస్ అధికారులతో హోంమంత్రి అనిత భేటీ
anitha DGP

హోంమంత్రి వంగలపూడి అనిత మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో Read more

అయోధ్య రామాల‌యం దేశ ప్ర‌జ‌ల‌కు ప్రేర‌ణ‌ : ప్రధాని
Ayodhya Ram Temple is an inspiration to the people of the country.. Prime Minister

న్యూఢిల్లీ: అయోధ్య‌లో కొత్త నిర్మించిన రామ మందిరంలో రామ్‌ల‌ల్లాను ప్ర‌తిష్టాప‌న చేసి ఏడాది కావొస్తోంది. ఈ నేప‌థ్యంలో తొలి వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ దేశ ప్ర‌జ‌ల‌కు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×