Hearing on Vamsi bail petition postponed

Vallabhaneni Vamsi : వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

Vallabhaneni Vamsi : వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలింది. తమ భూమిని బెదిరించి లాక్కున్నారనే ఆరోపణలపై అత్కూరు పోలీసు‌స్టేషన్‌లో వల్లభనేని వంశీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు లో ఇవాళ(సోమవారం) విచారణ జరిగింది.

Advertisements
 వంశీ బెయిల్ పిటిషన్ పై

తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా

భూ అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించారు. కానీ న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఇక లిక్కర్ స్కాం కేసులో రాజ్ కసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ ని ఆదేశించిన హైకోర్టు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

ఈ మూడు కేసుల్లో ఆయన రిమాండ్ ఖైదీగా

కాగా, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విజయవాడ జైల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వంశీపై ఈ కేసుతో పాటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసు, సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసు కూడా ఉన్నాయి. ఈ మూడు కేసుల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గత కొద్ది వారాలుగా ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారగా, కోర్టు తాజా నిర్ణయం పట్ల అందరూ ఆసక్తిగా ఉన్నారు.

Read Also:  వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు

Related Posts
Adilabad: ఆదిలాబాద్ లో ఘోరం..రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
Adilabad: ఆదిలాబాద్ లో ఘోరం..రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా వరుస రోడ్డు ప్రమాదాలతో అల్లకల్లోలంగా మారింది. జాతీయ రహదారి 44 పై గంటల వ్యవధిలో చోటుచేసుకున్న మూడు వేర్వేరు ప్రమాదాలు జిల్లాను విషాదంలో Read more

అమిత్ షా వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనం
Amit Shah comments are proof of BJP arrogance.. sharmila

అమరావతి: పీసీసీ చీఫ్ షర్మిల కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై విమర్శలు గుప్పించారు. అమిత్ షా తన మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని Read more

శ్రీశైలంలో భక్తుల రద్దీతో సందడి: ప్రత్యేక ఏర్పాట్లు
శ్రీశైలంలో భక్తుల రద్దీతో సందడి ప్రత్యేక ఏర్పాట్లు

శ్రీశైలంలో భక్తుల రద్దీతో సందడి ప్రత్యేక ఏర్పాట్లు సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో నంద్యాల జిల్లాలోని శ్రీశైల ముక్కంటి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ అనూహ్యంగా Read more

‘Operation Brahma’ : మయన్మార్కు భారత్ సాయం
Operation Brahma start

అత్యంత తీవ్రమైన భూకంపాలతో మయన్మార్ తీవ్రంగా నష్టపోయింది. అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు, వందలాది భవనాలు నేలకొరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో మయన్మార్‌కు సహాయంగా భారత్ ‘ఆపరేషన్ బ్రహ్మ’ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×