హత్రాస్‌లో ఘోర ప్రమాదం..ఇద్దరు మృతి..16 మందికి గాయాలు

రోడ్డు ప్రమాదాలు అనేవి రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఎన్ని రోడ్డు జాగ్రత్తలు పాటించినప్పటికీ అనుకోని ప్రమాదాలు మాత్రం అమాయకులను బలి తీసుకుంటున్నాయి. తాజాగా హత్రాస్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..16 మందికి గాయాలు అయ్యాయి. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును డబుల్ డెక్కర్ బస్సు ఢీ కొన్నది. ఈ సంఘటన సికందరరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని హత్రాస్‌లోని టోలి గ్రామంలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రక్కును మియాంగాంజ్ నుంచి చండీగఢ్ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఇక చనిపోయిన వారిని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టి సారించారు, గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) అధికారిక ప్రకటన తెలిపింది.