హత్రాస్‌ ఘటన..తొలిసారి స్పందించిన భోలేబాబా

Hathras incident.. Bholebaba who responded for the first time

లక్నోః ఈ నెల 2న ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో భోలేబాబా సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత భోలేబాబా తొలిసారి స్పందించారు. ఈ విషాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనకు కారకులైన నిందితులు తప్పించుకోలేరని విశ్వాసం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాల పక్షాన నిలబడాలని తన కమ్యూనిటీ సభ్యులను కోరుతూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ ఘటనకు సంబంధించి భోలేబాబాను విచారించాలని అధికారులు యోచిస్తున్న నేపథ్యంలో ఆయనీ వీడియోను విడుదల చేయడం గమనార్హం.

కాగా, తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దేవప్రకాశ్ మధూకర్‌ను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో గురువారం రాత్రి వరకు ఇద్దరు మహిళా వాలంటీర్లు సహా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.