ఒకే కుటుంబానికి చెందిన ఆరు మంది పిల్లలకు ఏకకాలంలో వివాహం – హర్యానాలో విశేషం
Haryana : భారీ ఖర్చులతో పెళ్లిళ్లు జరిపే కాలంలో హర్యానాలోని హిస్సార్ జిల్లా గవాధ్ గ్రామంలో ఒక కుటుంబం తీసుకున్న వినూత్న నిర్ణయం అందరినీ ఆకట్టుకుంది. అదే కుటుంబానికి చెందిన ఆరుగురు పిల్లలకు రెండు రోజుల్లో ఒకే కళ్యాణ మండపంలో వివాహాలు జరపడం విశేషంగా మారింది. పూనియా కుటుంబానికి చెందిన రాజేష్ పూనియా మరియు అమర్ సింగ్ పూనియా అనే ఇద్దరు అన్నదమ్ములకు ముగ్గురు ముగ్గురు పిల్లలు – ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి – ఉన్నారు. వీరంతా అన్నదమ్ముల పిల్లలే కావడం గమనార్హం.అనవసర ఖర్చులను తగ్గించి సమయాన్ని ఆదా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ కుటుంబం ఏకకాలంలో వివాహాలు జరిపింది. ఏప్రిల్ 18న ఇద్దరు అబ్బాయిల వివాహాలు జరగగా, మరుసటి రోజు అంటే ఏప్రిల్ 19న నలుగురు అమ్మాయిల వివాహాలు ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లిళ్ల సందర్భంగా గవాధ్ గ్రామం మొత్తం పూనియా ఇంటికి తరలివచ్చి సందడి చేసింది. గ్రామస్థులు ఈ సామూహిక కుటుంబ పెళ్లిళ్లను చూసి హర్షం వ్యక్తం చేశారు.

ఒకే వేదికపై ఆరు వివాహాలు – అద్భుత కుటుంబ నిర్ణయం
ఈ కార్యక్రమం ద్వారా కుటుంబం సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చింది. డబ్బు ఆదా కాకుండా, కుటుంబాల మధ్య సోదరభావం ఎలా పెంపొందించాలో ఈ ఉదాహరణ ద్వారా తెలియజేసింది. గ్రామస్థులు కూడా తమ పిల్లల పెళ్లిళ్లను ఇలాగే కలిపి చేయాలని నిర్ణయించుకుంటున్నారు. రమేష్ హవల్దార్ అనే స్థానికుడు మాట్లాడుతూ – “భవిష్యత్తులో పెరిగే ఖర్చులను అధిగమించేందుకు ఇలాంటి నిర్ణయాలు అవసరం,” అని పేర్కొన్నారు.రాజేష్ పూనియాకు కవిత, ప్రియాంక అనే కుమార్తెలు, సందీప్ అనే కుమారుడు ఉన్నారు. అమర్ సింగ్ పూనియాకు మోనికా, ప్రీతి కుమార్తెలు, సంజయ్ అనే కుమారుడు ఉన్నాడు. వీరందరి వివాహాలు గ్రామస్థుల సమక్షంలో, సంపూర్ణ మద్దతుతో, సాంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ వేడుకలు గ్రామానికే కాదు, రాష్ట్రానికి కూడా ఒక ఆదర్శంగా నిలుస్తున్నాయి.
Read More : Rs.100 Coin : సత్యసాయి శత జయంతికి రూ.100 నాణెం