అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన సమయంలో తీసుకున్న నిర్ణయాలపై హార్వర్డ్ యూనివర్సిటీ బహిరంగంగా ప్రతిస్పందించింది. మసాచుసెట్స్లోని ఫెడరల్ కోర్టులో హార్వర్డ్ యూనివర్సిటీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్పై కేసు నమోదు చేసింది. ఇందుకు కారణం.. యూనివర్సిటీకి ఇవ్వాల్సిన $2.2 బిలియన్ల ఫండ్లను నిలిపివేస్తామంటూ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడడమే. ఈ చర్యను యూనివర్సిటీ తీవ్రంగా నిరసించింది.
ఫండ్లపై బలవంతపు విధానం
యూనివర్సిటీ ప్రెసిడెంట్ అలన్ గార్బర్ మాట్లాడుతూ, “ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హార్వర్డ్పై ఒత్తిడి తీసుకురావడానికి ఈ విధానాన్ని ఎంచుకుంది. విద్యాసంస్థల స్వాతంత్ర్యాన్ని కాలరాస్తూ, తమ నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తున్నారు. ఇది న్యాయ విరుద్ధమైతే కాకుండా, విద్యావ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసే నిర్ణయం” అని తీవ్రంగా స్పందించారు.
లీగల్ యాక్షన్ ద్వారా పోరాటం
ఈ వ్యవహారంలో తాము వెనక్కి తగ్గబోమని హార్వర్డ్ స్పష్టం చేసింది. విద్యాసంస్థల హక్కులను రక్షించుకోవడానికి లీగల్ యాక్షన్ తీసుకోవడం తప్పనిసరిగా మారిందని పేర్కొంది. ఈ కేసు అమెరికా అంతటా విద్యా రంగానికి కీలక మలుపుగా మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ పాలనలో విద్యాసంస్థలపై తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పటికే వివాదాస్పదంగా మారగా, హార్వర్డ్ చర్య మరింత చర్చనీయాంశమైంది.