కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా మేల్కోండి అంటూ హరీష్ రావు ట్వీట్

harish-rao-says-bjp-win-only-one-seat-in-election

ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూతపడటమంటే పాలకులు సిగ్గుతో తలదించుకోవాలని మాజీ మ్నాత్రి , సిద్దిపేట బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుంది.. కానీ కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు తరగతి గదుల్లో చదువుకు నోచుకోని పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటి కాదు రెండు కాదు 43 పాఠశాలలు.. అదీ గిరిజనులు అధికంగా నివసించే ప్రాంతంలో ఉపాధ్యాయులు లేక మూతపడటమంటే పాలకులు సిగ్గుతో తలదించుకోవాన్నారు.

ప్రభుత్వ తప్పిదం వల్ల గిరిజనులు ప్రాథమిక విద్యకు దూరం కావడం క్షమించరాని నేరమని తెలిపారు. కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపించింది ఉన్న స్కూళ్లను మూత వేయడానికా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మూతపడ్డ 43 ప్రభుత్వ పాఠశాలలను వెంటనే తెరిపించాలని డిమాండ్‌ చేశారు. టీచర్ల నియామకం జరిగేవరకు విద్యా వాలంటీర్లను నియమించాలని విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులు లేరన్న కారణంతో రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా చూడాలని, వెంటనే ముఖ్యమంత్రి స్థాయిలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపాలని ట్విట్టర్ వేదికగా ఎక్స్‌ వేదికగా కోరారు.