త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ – మాజీ ఎంపీ GV హర్షకుమార్

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా కలిసి వచ్చే వ్యక్తులు, సంఘాలతో కలిసి త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు మాజీ ఎంపీ GV హర్షకుమార్ ప్రకటించారు. దేశం మొత్తం వర్గీకరణను వ్యతిరేకిస్తుంటే ఉమ్మడి ఏపీలో మాత్రం మాదిగలు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఓ వ్యక్తి సృష్టించిన ఉద్యమంతో ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన మాదిగలు పోరాటంలోకి వెళ్తున్నారు.

క్రీమీలేయర్‌ను పొందుపరిచిన కారణంగా ఉద్యోగస్తుల పిల్లలకు అన్యాయం జరుగుతుంది. ఈ విషయంలో కేంద్రం మరోసారి సమీక్షకు వెళ్లే అవకాశం ఉంది. జిల్లాల వారీగా వర్గీకరణ ఎలా చేపడతారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి’ అని అన్నారు. త్వరలో ప్రకటించబోయే పార్టీ నాయకుడు ఎవరనేది త్వరలో ప్రకటిస్తామని, రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు వర్గీకరణకు అనుకూలంగా ఉండడంతో కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పారు.