మదనపల్లెలో కాల్పుల కలకలం..

అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో నాటు తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. మండలంలోని వలసపల్లి పంచాయతీ నవోదయ కాలనీలో ఆదివారం రాత్రి దివాకర్, అతని స్నేహితులతో మద్యం సేవిస్తుండగా..వారి మధ్య గొడవ తలెత్తింది. పెద్ద పెద్దగా అరుస్తుండగా.. ఆనంద్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నారని దివాకర్‌ని ప్రశ్నించారు.

దీంతో ఆనంద్ ఫై..దివాకర్ గొడవపడ్డారు. ఇరు వర్గాలను వారించేందుకు ప్రవీణ్ అనే వ్యక్తి అక్కడికి వెళ్లి మాట్లాడుతుండగా.. దివాకర్ ఇంటికి వెళ్లి నాటు తుపాకి తీసుకొచ్చి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నాటు తుపాకీ రవ్వలు తగిలి ప్రవీణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.