ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ టైటాన్స్ (GT) జట్టు అంచనాలను తలకిందులు చేస్తూ గణనీయమైన విజయాలతో టేబుల్ టాపర్గా నిలిచింది. నిన్న కేకేఆర్ (కోల్కతా నైట్ రైడర్స్) తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టు దుమ్ముదులిపింది. ఈ గెలుపుతో లీగ్ పాయింట్ల పట్టికలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ టాప్ పొజిషన్ను దక్కించుకుంది. గెలుపు సిరీస్ను కొనసాగిస్తూ ప్రత్యర్థులకు కఠిన పోటీగా మారింది.
బ్యాటింగ్, బౌలింగ్లో అద్భుత ప్రదర్శన
గుజరాత్ విజయాలకు ప్రధాన కారణం బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో ఉన్న సమతూకం. ఓపెనర్ సాయి సుదర్శన్ ఇప్పటివరకు 417 పరుగులతో ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకోగా, పేసర్ ప్రసిద్ధ కృష్ణ 16 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ ను తమ జట్టుకు తీసుకువచ్చాడు. వీరితో పాటు శుభ్మన్ గిల్, జోస్ బట్లర్ వంటి స్టార్ ఆటగాళ్లతో గుజరాత్ టాప్ ఆర్డర్ మరింత బలంగా తయారైంది. ఎవరిని తక్కువ అంచనా వేయలేని స్థాయికి ఈ జట్టు చేరింది.
ప్లేఆఫ్స్ బెర్త్ పక్క
టేబుల్ టాపర్గా నిలుస్తూ, అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణిస్తున్న గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ బెర్త్ దిశగా దూసుకెళ్తోంది. జట్టు కట్టుదిట్టంగా ఉండటమే కాకుండా, ఆటగాళ్లంతా తమ బాధ్యతను నిర్వర్తిస్తూ జట్టుకు విజయం అందిస్తున్నారు. ఈ ఫార్మ్ కొనసాగితే గుజరాత్ టైటాన్స్ మరోసారి ఫైనల్కు చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అభిమానులు తమ జట్టుపై గట్టి నమ్మకంతో ఉన్నారు.